Mercy Support


                                    'మెర్సి ఆన్ స్లమ్స్'గల్ఫ్ బాధిత కుటుంబానికి ఆర్ధిక సాయం

మండలంలోని బన్సపల్లికి చెందిన గల్ఫ్ బాధిత కుటుంబానికి ఓ స్వచ్చంద సంస్థ సోమవారం దిలావర్ పూర్ లో తహసిల్దార్ నిజాముల్ హసన్ చేతుల మీదుగా రూ . 10 వేల ఆర్ధిక సాయం అందజేసింది. గల్ఫ్ బాధిత కుటుంబాలను ఆడుకొనేందుకు ప్రవాస భారతీయులు 'మెర్సి ఆన్ స్లమ్స్' పేరిట ఓ స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేశారు. గత నెలలో బహ్రెయిన్ లో విద్యుధాగతంతో బన్సపల్లి కి చెందిన పోల ముత్యం మరణించారు. కుటుంబ పోషణకర్త మరణంతో ముత్యం భార్య రాణి, 11 ఏళ్ల లోపు ముగ్గురు ఆడ పిల్లలు దిక్కుతోచని స్తితిలో పడ్డారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో మృతుడి భార్య పోల రాణికి ఈ సాయాన్ని అందించినట్లు సంస్థ ప్రతినిధులు నరేందర్ ఘోరే, కోటేశ్వర్ రావు, సురేష్ తెలిపారు. కార్యక్రమంలో బన్సపల్లి సర్పంచ్ శ్యాంసుందర్ రెడ్డి, ఆర్ఐ ఆనిరుద్, వి ఆర్వో వినోద్ రెడ్డి తదితరులు ఉన్నారు.
-------------------------------------------------------------------------------------------------------------


                                                  గల్ఫ్ బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

భీమ్ గల్ మండలం బడ భీమ్ గల్ కు చెందిన గల్ఫ్ మృతుడు కే.నాగన్న కుటుంబానికి ఇరాక్ లోని మెర్సి ఆన్ స్లమ్స్ సంస్థ వారు పది వేల రూపాయలను సోమవారం అందజేశారు. నాగన్న (48)
మార్చి 28 న మలేషియాలో మరణించగా ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది. దీనికి స్పందించి మెర్సి ఆన్ స్లమ్స్ ప్రతినిధులు రాజేంద్రప్రసాద్ జోయెల్ చంద్ర నాగన్న భార్య నర్సుబాయికి నగదు అందజేశారు. వీరి వెంట ఎంపీటిసి ముత్తెన్న, ఉపసర్పంచ్ మోహన్ ఉన్నారు.
-------------------------------------------------------------------------------------------------------------


                                              

                                      గల్ఫ్ మృతుల కుటుంబాలకు బాసట "మెర్సి ఆన్ స్లమ్స్"

ఆర్మూర్, ఏప్రిల్4 (ఆన్ లైన్) బ్రతుకు దెరువు కోసం గల్ఫ్ వెళ్లి మృతి చెందినా వారి కుటుంబాలను ఆదుకోవాలని ఇరాక్ లోని తెలుగువారు నిర్ణయించుకున్నారు. ఇటీవల ఆంధ్రజ్యోతి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా టబ్లాయిడ్లల లో ప్రచురితమైన గల్ఫ్ మృతుల కుటుంబాల దీనగాతలకు వారు చలించిపోయారు. ఈ మేరకు ఆంధ్రజ్యోతి సాయంతో రెండు కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ఇరాక్ కేంద్రంగా ప్రవాసీయులు నడుపుతున్న "మెర్సి ఆన్ స్లమ్స్" సంస్థ ముందుకు వచ్చింది. చెత్తకుప్పలు, మురికివాడల్లో మగ్గుతున్న పిల్లల, కుటుంబ పెద్దల్ని కోల్పోయి భవిష్యత్ అందకారంగా మారిన చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపేందుకు పలు కార్యక్రమాలను ఈ సంస్థ చేపడుతుంది.

ఇటివల నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ మండలం బడా భీమ్ గల్ కు చెందిన కొండూర్ నాగన్న (50) మలేషియాలో మరణించారు. ఆదిలాబాద్ జిల్లా బంసపల్లి చెందిన పోలా ముత్యం (33) కూడా గల్ఫ్ లో మరణించారు. వీరు గల్ఫ్ లో మరణించినట్లు ఆంధ్రజ్యోతి లో కథనం రాగ వీరి కుటుంబాలను ఆదుకుంటామని "మెర్సి ఆన్ స్లమ్స్" ప్రతినిధులు ప్రకటించారు. బ్రతుకు దెరువు కోసం వచ్చి గల్ఫ్ లో మరణించడం తమనేంతో బాదించిందని ఆ పేద కుటుంబాల్లోని పిల్లల భవిష్యత్ ను కాపాడేందుకు ఆర్ధిక సాయం చేసేందుకు సిద్దమయ్యామని సంస్థ ప్రతినిధులు జోయెల్ చంద్ర అలియాస్ చంద్రకుమార్ మూల్గు, బండారు రాజేంద్ర ప్రసాద్, రామకృష్ణ చింత తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన వీరు ఇరాక్ లోని కేబీఆర్ అనే అమెరికన్ కంపెనీ ఉద్యోగులు.

స్థానికంగా ఉపాది లేక అప్పోసోప్పో చేసి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి ప్రధానంగా యువకులు గల్ఫ్ వెళ్తున్నారు. అక్కడ ఏదైనా ప్రమాదంలో మృతి చెందితే ఇక కుటుంబం ఆశలు, ఆధారం కోల్పోయినట్లే. నెలల తరబడి ఎదురు చూసిన మృతదేహం స్వదేశానికి చేరదు. అది వచ్చేవరకు ఏడ్చే కన్ను ఆగదు. మరోవైపు కుటుంబ పెద్దను కోల్పోవడంతో అప్పుల వారి వేధింపులు తీవ్రమవడంతో పలు పేద కుటుంబాలు సర్వం కోల్పోయి రోడ్డు పాలవుతున్నాయి. ఇలాంటి కుటుంబాల్లోని పిల్లలది మరి దారుణం. భవిష్యత్ అంతా అందకారంగా మారిపోతుంది. అలంటి పరిస్తితే నాగయ్య. ముత్యం కుటుంబాలది. అలాంటి పిల్లల కోసమే కొంతలో కొంత సాయనికైనా మేం సిద్దమవుతున్నాం. ఆంధ్రజ్యోతి సహకారంతో బాధిత కుటుంబాలకు సాయపడాలని నిర్ణయించుకున్నాం,, అన్నారు జోయెల్ చంద్ర. మానవతా మూర్తులు ముందుకు వచ్చి తమను ఆదుకోవాలని ఆ కుటుంబాలను కోరుతున్నారు. నాగన్న భార్య ప్రస్తుతం బడా భీమ్ గల్ లోనే ఉంటోంది. ఆ కుటుంబానికి సాయపడలనుకునే దాతలు mercyonslums@gmail.com సంప్రదించవచ్చు.

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites