గల్ఫ్ కు పంపిస్తానని మోసగించిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు:
కమాన్ పూర్, న్యూస్ టుడే: నిరుద్యోగులైన యువకులను సింగపూర్, దుబాయ్ వంటి దేశాలకు పంపిస్తానంటూ నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై ఆదివారం బాదితులు కమాన్పూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మండల పరిధిలోని జూలపల్లి గ్రామానికి చెందిన బోల్లపెల్లి జగన్ గౌడ్ తమను విదేశాలకు పంపిస్తానని రూ.3 లక్షల గ్రామానికి చెందిన మల్హర్ మండలం పెద్దతూండ్ల గ్రామానికి చెందిన గుండా నాగరాజు, వెనిశెట్టి శంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే కమాన్ పూర్కు చెందిన మంద రాజయ్య, బాలకృష్ణల వద్ద నుండి జగన్ రూ. 2 .75 లక్షలు తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ఐ.పి నోటిసులు పంపించారని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కమాన్ పూర్ ఎస్.ఐ వెంకటేశ్వర్లును కోరారు. జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన యువకులు 16 మందికి ఇలా ఐ.పి నోటిసులు జారి చేసి జగన్ పరారిలో ఉన్నాడని వారు తెలిపారు.