గల్ఫ్ లో యశ్వంతరావుపేట వాసి మృతి
బతుకుదెరువు కోసం కన్నవారిని విడిచి ఎడారి బాట పట్టిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు బరువైన వస్తువు మీద పడి అక్కడిక్కడే మృత్యువాత పడ్డాడు. దీంతో ఆ కుటుంబంలో పండుగ రోజు తీరని విషాదం అలుముకుంది. మండలంలోని యశ్వంతరావుపేటకు చెందిన మందాల రమేష్ (28) అనే యువకుడు 18 నెలల క్రితం అప్పులు చేసి దుబాయి వెళ్ళాడు. అక్కడే ఓ కంపనీలో క్రేన్ ఆపరేటర్ గా పని చేసేవాడు. ఈ క్రమంలో గత శనివారం పై అంతస్తులో పనులు నిర్వహిస్తున్న క్రమంలో బలమైన వస్తువు మీద పడటంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ మేరకు అతడి స్నేహితులు కుటుంబసభ్యులకు సమాచారమందించారు. మృతుడికి భార్య రామ, ఈశ్వర్ (6), రిశ్వంత్ (4) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా అదే కంపనిలో గల్ఫ్ లో ఉంటున్న రమేష్ మూడేళ్ళ అనంతరం 10 నెలల క్రితం వచ్చి వెళ్ళాడు. గల్ఫ్ కోసం చేసిన అప్పులు తీరకముందే మృతి చెందటంతో యశ్వంతరావుపేట విషాదంలో మునిగిపోయింది. మరణ వార్త తెలియగానే అతడి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. మృతదేహాన్ని త్వరగా స్వగ్రామం చేరేల ఏర్పాట్లే చేసి బాధిత కుటుంబాన్ని ఆదుకుకోవాలని సర్పంచ్ తాండ్ర సత్యనారాయణ రావు ప్రభుత్వాన్ని కోరారు.