MERCY ON SLUMS -Let's Help Together

Well come to the MERCY ON SLUMS -Lets Help Together We are not following by religion or regional but we are following by HUMANITY. Please do support us to give gift of life to Gulf Indians and Children.

MERCY ON SLUMS -Let's Help Together

The saffron represents courage, sacrifice, patriotism, and renunciation.

MERCY ON SLUMS -Let's Help Together

The white is in the center, symoblizing the hope for Truth, Unity and Peace.

MERCY ON SLUMS -Let's Help Together

The green color shows the Indian culture, agriculture, Indian people and complete geographical history of our country. The color also tells about our relation to soil and our relation to environment.

MERCY ON SLUMS -Let's Help Together

Mercy On Slums Logo is made of Indian Flag color, Saffron, White and Green. Mahatma Gandhi and Mother Teresa are included in our Logo.

Mercy On Slums -Let's Help Together..!

MERCY ON SLUMS

A Child is God's gift to the family. Each child is created in the special image and likeness of God for greater things to love and to be loved.

God told us, "Love your neighbors as yourself." So first we have to love ourselves rightly, and then love our neighbors. But how can we love ourselves unless we accept the way God has made us?

Many children are working in their childhood, roving through streets; Government is not doing much about this situation. Innocent children are lying on the roads and are forced by the circumstances to beg; every night they are not sure where they will spend it. There are children who are begging on the streets in the day and are spending their nights on the footpath. Most of them are naked without clothes and are collecting their food from the Garbage. Because of such circumstances, children are turning to robbery, joining underworld gangs and thus ruin their life. Since the underprivileged are living a very poor life their children are left with no choice.

We are the fortunate ones to have all kind of good things viz. education, food, shelter and all luxuries in life but such children cannot even think of basic necessity such as food. Any poor children who are interested in studies cannot think about it due to poverty.


Today’s youth:
Young boys and girls are addicted to sex, drugs, alcohol etc. to name a few. They are so much into these habits that they have become slaves to it. There are number of cases of young unmarried girls who give birth to children and then dump them in the garbage, to be eaten by stray dogs and if any survive only to beg on the streets.

Most of us think it is not our problem; with such attitude we will never be able to do things for others. We have to support such children, young people and others who need our support by way of providing the primary requirements such as food and clothes and thus give a better future for the poor children.

You can make a difference by Sponsoring a Child.

In today’s busy schedule people are busy in their own world, it might not be possible to help on individual level, but we surely can contribute a little and help such children…… remember each small drop counts.

Hence a small group of Indians in Gulf have gone a step ahead and started MERCY ON SLUMS by our compassion with the main aim to help the downtrodden, exploited, poverty stricken children and Gulf Indians.

How can YOU help?


In any event, your active participation is important. We would greatly appreciate if you pass this information to friends, acquaintances and colleagues so that you can help our MERCY ON SLUMS to become well known in the public. There are many ways that you can help. If you have a good idea or would like to participate actively in our work for the children in India, please contact us at one of the following addresses. We will gladly provide you with more detailed information.
 

Gangaiah Died in Road Accident


రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గంగయ్య

దుబాయి లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొడిమ్యాల మండలం చెప్యాల పరిధిలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన బండపల్లి గంగయ్య (45) మృతి చెందాడు. ఈ మేరకు ఇక్కడి కుటుంబ సభ్యులకు బుధవారం సమాచారం అందింది. గతంలో దుబాయి వెళ్లోచ్చిన గంగయ్య కొద్దికాలం పాటు స్వగ్రామం లో గడిపాడు.ఆరు నెలల క్రితం కంపెనీ వీసాపై తిరిగి దుబాయి వెళ్ళాడు. తన కాలనికే చెందిన గంగాధర శంకరయ్య దుబాయి నుంచి స్వగ్రామానికి వెళ్తున్నందున అతడు ఉంటున్న క్యాంపస్ వెళ్లి తన కుటుంబ సభ్యుల కోసం గంగయ్య సామగ్రి అందజేశారు. తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించేందుకు అక్కడి వలస కార్మికులు ప్రయత్నిస్తున్నారు.

Rajaiah Died in Maskat


మస్కట్ లో అసువులు బాసిన జూలపల్లి వాసి

చేసిన అప్పులు తీర్చాలన్న తాపత్రయంతో ఎడారి దేశం బాట పట్టిన ఓ నిరుపేద మస్కట్ లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. జూలపల్లి మండలం కేంద్రానికి చెందిన మానుమండ్ల రాజయ్య (42) నెలల క్రితం బతుకుదెరువు కోసం అప్పులు చేసి మస్కట్ కు వెళ్ళాడు. పదవ తేదిన అక్కడ పనికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతదేహాన్ని కంపెనీ అధికారులు స్వదేశానికి పంపించగా హైదరాబాద్ విమానాశ్రయానికి చేరినట్లు బంధువులు తెలిపారు. రాజయ్యకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

Gopal Died in Behran


బెహరాన్ లో మల్యాల వాసి మృతి

ఉపాధి కోసం బెహరాన్ వెళ్ళిన మల్యాల వాసి పుష్పాల గోపాల్ (50) సోమవారం తెల్లవారు జామున మృతి చెందినట్లు సమాచారం అందింది. ఏడాది క్రితం గోపాల్ బెహరాన్ వెళ్ళాడు. సోమవారం తాను పని చేసే కంపెనికి చెందిన వాహనంలో అతడిని పనికి తీసుకు వెళ్ళడానికి సిబ్బంది వెళ్లి చూడగా గోపాల్ మరణించినట్లు కనుగొన్నారు. ఈ విషయాన్ని కంపెనికి తెలియజేసి శవాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించినట్లు మృతుడి బంధువులు తెలిపారు. గోపాల్ కుమారునికి ఇటివలే పోతారంనాకు చెందిన యువతితో నిశ్చితార్థం జరిగినట్లు వివరించారు. గోపాల్ మృతదేహాన్ని సాధ్యమైనంత తొందరగా స్వగ్రామం పంపించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Police arrested Mendayya


దుబాయిలో ధర్మసాగర్ పల్లి వాసి అరెస్టు

కోహెడ మండలం ధర్మసాగర్ పల్లికి చెందిన రాగుల మొండయ్య ఏప్రిల్ నెల 15న దుబాయికి వెళ్ళగా అక్కడ పోలీసులు అతన్ని అరెస్టు చేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. గతంలో దుబాయిలో పని చేసిన సమయంలో మొండయ్యకు ఒక సెల్ ఫోన్ దొరకగా అది హత్యకు గురైన ఒక వ్యక్తికి సంబంధించినదిగా పోలిసుల విచారణలో వెల్లడైంది. ఆ సెల్ ఫోన్ మొండయ్య వద్ద ఉండటంతో అతన్ని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. బతుకుదెరువు కోసం దేశంకాని దేశం పోయిన తన భర్తను అరెస్టు చేయడంతో కుటుంభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Srinivas Died in Dubai


దుబాయిలో నర్సింగాపూర్ వాసి మృతి ఇంటికి చేరిన మృతదేహం

ఉన్న ఉరిలో ఉపాధి లభించక దుబాయి చేరిన ఓ అభాగ్యునికి అక్కడా చుక్కెదురయింది. ఎంతో కొంత పొగ చేసుకొని వెనక్కి వచ్చేద్దామని అనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా మృత్యువాత పడటంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఎప్పుడోస్తాడని అతని రాకకోసం ఎదురుచూస్తుండగా శవమై ఇంటికి చేరటంతో ఇంటిల్లిపాది కన్నీరుమున్నేరై విలపించారు. జగిత్యాల మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన మద్దెలపల్లి శ్రీనివాస్ (35) వడ్రంగి కార్మికుడు ఉపాధి కోసం గత కొన్నేళ్ళుగా దుబాయి వెళ్తున్నాడు. రెండేళ్ళ క్రితమే వచ్చివేల్లిన ఆటను మరోసారి వచ్చేందుకే సన్నాహాలు చేసుకుంటుండగా వారం క్రితం అనూహ్యంగా అక్కడ మృతి చెందిన సమాచారం తెలిసి కుటంబ సభ్యులు అప్పటి నుంచి మృతదేహం కోసం ఎదురుచూస్తూ కంటి మీద కునుకు లేకుండా గడిపారు. కాగ ఆదివారం మృతదేహాన్ని ఇంటికి తీసుకురాగా కన్నీళ్ళ వీడ్కోలు నడుమ అత్యక్రియలు నిర్వహించారు. స్థానిక నేతలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Abdhul Majid Died in Kuwait


సౌదీలో మేట్ పల్లి వాసి మృతి

సౌదీలో నాలుగురోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన మేట్ పల్లి వాసి చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని దుబ్బవాడకు చెందిన అబ్దుల్ మజీద్ (38) మూడేళ్ళ క్రితం సౌదిలోని రియాద్ లో డ్రైవర్ గా పని చేయడానికి వెళ్ళాడు. నాలుగు రోజుల క్రితం కారు బోల్తా పడడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు మృతుడి బావమరుదులు అజీద్,ముజీబ్,ముజాహిద్ ఫోన్ ద్వారా కుటుంబీకులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పంపడానికయ్యే ఖర్చులు భరించడానికి యజమాని అంగీకరించలేదు. దీంతో అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. మజీద్ మరణవార్త తెలిసిన అతని భార్య సాజీదబేగం, ముగ్గురు కూతుళ్ళు, కొడుకు రోదిస్తున్న తీరు పలువురి హృదయాలను కలచివేసింది.

Ravindher Died in Kuwait


గల్ఫ్ లో అన్నారం వాసి మృతి…. మృతదేహం కోసం ఎదురు చూపులు

చేసిన అప్పులు తీర్చటం కోసం పొట్ట చేతిలో పట్టుకొని గల్ఫ్ కు వెళ్ళిన ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించిన సంఘటన మానకొండూర్ మండలం అన్నరంలో చోటు చేసుకుంది. వివరాలు... గ్రామస్థుల కథనం ప్రకారం అన్నారం గ్రామానికి చెందిన పొట్టల రవీందర్ (35) అనే వ్యక్తి కూలీ పని చేస్తుకుంటూ జీవిస్తున్నాడు. కుటుంబ పోషణ భారం కావడంతో అప్పులు చేశాడు. అప్పులు తీర్చేందుకు మరో రూ. 90 వేలు అప్పు చేసి ఏడాదిన్నర క్రితం గల్ఫ్ దేశమైన కువైట్ కు వెళ్ళాడు. కాగ శుక్రవారం రవీందర్ కు గుండెపోటు రావటంతో కుప్పకూలిపోయాడు. తోటి స్నేహితులు చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందినట్లు ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కొడుకు మృతి చెందడాన్న సమాచారంతో వృద్దదంపతులు ఒకేసారి షాక్ కు గురయ్యారు. మృతునికి తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు కుతురులున్నారు. దీంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహం కోసం నాలుగు రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు.

ఎస్పీకి వినతి …
జీవనోపాధి కోసం వెళ్ళిన పొట్టాల రవీందర్ గుండెపోటుతో మృతి చెందగా మృతదేహాన్ని తీసుకురావాలని జిల్లా ఎస్పీకి మృతుడి భార్య అంజమ్మ వినతి పత్రాన్ని సమర్పిచారు. బతుకు దెరువు కోసం అప్పులు చేసి కువైట్ కి వెళ్లి తన భర్త మరనిచగా మృతదేహాన్ని తీసుకువచ్చే ఆర్ధిక స్థోమత తమ వద్ద లేదని మృతదేహాన్ని ప్రభుత్వ ఆర్ధిక సహాయంతో తీసుకురావాలని వినతి పత్రంతో వారు పేర్కొన్నారు.

Ramesh Died in Dubai


గల్ఫ్ లో రోడ్డు ప్రమాదంలో కోజన్ కొత్తూర్ వాసి మృతి

దసరా పండుగ ఇంటికి వస్తానని దుబాయి నుంచి ఫోన్లో మాట్లాడిన వ్యక్తి మరునాడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో అయన రాక కోసం ఎదురుచూస్తున్న కుటుంబీకులు రోదనలు మిన్నంటాయి. ఈ సంఘటన ఇబ్రహీంపట్నం మండలం కోజన్ కొత్తూర్ లో విషాదం నింపింది. గ్రామంలో ఎలక్ట్రిషియాన్ గా పనిచేసిన చౌడరపు రమేష్ (38) బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్ళాడు. టి.సి.టి అనే కన్ స్ట్రక్షణ్ కంపెనీలో కార్మికుడిగా పని చేస్తున్న అయన గత బుధవారం విధులకు వెళ్లేందుకు దుబాయి ఈన్వేస్టేమెంట్ పార్కు వద్ద బస్సు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడి మృతి చెందాడు. ఈ మేరకు బంధువులు, స్నేహితులు ఆదివారం సమాచారం అందించడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గత మంగళవారం ఫోన్ చేసి తాను దసరా పండుగకు ఇంటికి రావడానికి సిద్దమవుతున్నానని తెలిపాడంటూ భార్య రమాదేవి, కొడుకులు అచ్యుత్, అజయ్ లు రోదించడం కలిచివేసింది. గత ఏడేళ్ళ క్రితం సౌదీ అరేబియా వెళ్ళడంతో ఇంకా రూ. 1.50 లక్షల వరకు అప్పు ఉందని మృతుని బంధువులు తెలిపారు. రమేష్ మృతదేహాన్ని స్వగ్రామానికి వెంటనే తెప్పించాలని గ్రామ సర్పంచి పిండి ముత్తమ్మ, మాజీ సర్పంచి రాఘవులు, ఎంపీటీసి గంగాధర్ లు కోరారు.

Sathaiah Died in Qatar


దోహా ఖతర్ లో………రామలచ్చక్కపేట వాసి హత్య

మేట్ పల్లి మండలం రామలచ్చక్కపేట గ్రామపంచాయతీ పరిధిలోని అల్లూరి సీతారామయ్యరాజు తండాకు చెందిన గుల్లావాత్ సత్తయ్య (35) దోహఖతర్ లో హత్యకు గురయ్యాడు. బతుకుదెరువు నిమిత్తం మూడేళ్ళ క్రితం అక్కడికి వెళ్ళిన సత్తయ్య తొమ్మిది నెలల క్రితం స్వగ్రామానికి వచ్చి మరోసారి వెళ్ళాడు. అక్కడ ఎపీసి కంపనీలో లేబర్, సెక్యురిటి గార్డుగా పని చేశాడు. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతం పెంచక పోవడంతో వీసా రద్దు చేసుకొని స్వగ్రామానికి రావాలని ప్రయత్నించాడు. ఇంతలోనే సత్తయ్య హత్యకు గురైనట్లు దోహా ఖతర్ లో ఉన్న తండా వాసులు సోమవారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నిరుమున్నిరుగా రోదిస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం... సత్తయ్య రంజాన్ పండుగ రోజు హత్యకు గురైనట్లు భావిస్తున్నారు. ఆ రోజు అక్కడ సెలవు దినం కావడంతో కొందరు మిత్రులు సత్తయ్యను కలిసేందుకు ఫోన్ లో ప్రయత్నించగా ఫోన్ రింగ్ అవుతున్న స్పందన రాలేదు. ఆ తర్వాత కూడా అదే పరిస్థితి. అనుమానం వచ్చిన మిత్రులు నాలుగు రోజుల క్రితం సత్తయ్య ఉండే గదికి వెళ్లి చూడగా సెల్ ఫోన్ మాత్రమే కనిపించింది. ఇంతలో పట్టన శివారులో సత్తయ్య హత్యకు గురైనట్లు అక్కడి పోలీసులు గుర్తించారు. మృతుడి వద్ద ఉన్న ఫోన్ నంబర్ల ఆధారంగా అతడి నంబరుకు ఫోన్ చేయగా మిత్రులు మాట్లాడారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకోని సత్తయ్య ఫోన్ ఎలా వచ్చిందని విచారణ జరిపి వదిలేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. సంఘటన స్తలంలో లభించిన ఆనవాళ్ళను బట్టి సత్తయ్యను కర్రలతో కొట్టి హత్య చేసినట్లు భావిస్తున్నారు. మ్రుతుడికి తల్లి గంగు, భార్య సుగుణ, కూతురు సుమలత(12), కొడుకు వినోద్ (11) ఉన్నారు. సుమలత కరీంనగర్ లో ఏడో తరగతి చదువుతుండగా, వినోద్ స్థానిక పాటశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. సత్తయ్య హత్యలో ఆ కుటుంబం ఆధారం కోల్పోయింది. తండాలో విషాదం నెలకొంది.

Naredhra Died in Dubai


స్వగ్రామం చేరిన వలసజీవి మృతదేహం

ఉపాధి నిమిత్తం గల్ఫ్ బాట పట్టిన ఓ వ్యక్తి గల్ఫ్ లో గుండెపోటుతో మరణించగా మృతదేహం శుక్రవారం స్వగ్రామానికి చేరింది. కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన పుప్పల నరేంద్ర (37) ఉపాధి నిమిత్తం దుబాయి వెళ్ళాడు. అక్కడ 3 ఆర్ఎస్ టెక్నికల్ సర్వీసెస్ 15 ఏళ్లుగా ప్రాజెక్టు ఇంజనీర్ హోదాలో పని చేస్తున్నారు. జూలై 30 న విధి నిర్వహణలో ఉన్న నరేంద్రకు గుండె నొప్పి రావడంతో అతని మిత్రులు ఆసుపత్రిలో చేర్పించగా అక్కడ మృతి చెందారు. మృతదేహం స్వగ్రామానికి రాగానే బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మ్రుతుడికి భార్య స్నేహలత, ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు.

Rajareddy Died of Heart Attack in dubai


స్వగ్రామం చేరిన వలసజీవి మృతదేహం
గుండెపోటుతో దుబాయిలో మృతి చెందిన మల్లాపూర్ మండలం వెంకట్రావు పేట గ్రామానికి చెందిన దాసరి రాజారెడ్డి(34) మృతదేహం స్వగ్రామం చేరడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. మూడేళ్ళుగా దుబాయిలోని కొరియా ఎల్ఎల్సి కంపనిలో రాజారెడ్డి పని చేస్తున్నాడు. ఈ నెల 20 న గుండెపోటుతో మృతిచెందినట్లు కుటుంబీకులకు సమాచారం అందింది. వారం రోజుల అనంతరం మృతదేహం స్వగ్రామం చేరడంతో అంత్యక్రియలు నిర్వహించారు. శవయాత్రలో సర్పచ్ ఆనంద్ గౌడ్ తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

Shaik Hussain Died in Soudi


సౌదీలో జగిత్యాల వాసి మృతి

జగిత్యాల ఇస్లంపురాకు చెందిన షేక్ హుసేన్ శుక్రవారం సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. షేక్ హుసేన్ తో పాటు అతని కుమారుడు అఫ్రోజ్ లు ఉపాధి రిత్యా గత కొంతకాలంగా సౌదీలో నివసిస్తున్నారు. వీరిద్దరూ ఓ వాహనం లో జెడ్డాకు వెళ్తుండగా ఎదురుగ వచ్చిన వాహనం దీకోట్టడంతో తండ్రి షేక్ హుసేన్ మృతి చెందగా కుమారుడు అప్రోజ్ రెండు కాళ్ళు విరిగినట్లు జగిత్యాలకు సమాచారం అందింది. దీంతో వారి కుటుంబ సభ్యులు విషాదం లో మునిగిపోయారు. షేక్ హుసేన్ మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Lachayya Died in Road Accident


ఒమన్ లో లక్ష్మీపూర్ వాసి మృతి

రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామస్తుడు కల్లేపల్లి లచ్చయ్య ఒమన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గత నెల 24 న కంపెనీ వాహనంలో క్యాంపు కార్యాలయానికి తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదం జరిగినట్టు అయన బంధువులు తెలిపారు. ఈ సంఘటనలో కల్లేపల్లి లచ్చయ్య అక్కడిక్కడే మృతి చెందాడు. దీంతో ఒమన్ నుంచి మృతదేహాన్ని మంగళవారం మధ్యాహ్నం తరలించారు. కల్లేపల్లి లచ్చయ్య స్వగ్రామంలో ఉపాధి లేక ఇరవైయేళ్ళ క్రితం ఒమన్ దేశానికి వలస వెళ్ళినట్లు తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు, ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. మంగళవారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా లక్ష్మీపూర్ కు మృతదేహాన్ని తరలించారు. గ్రామస్తుల పెద్ద సంఖ్యలో అంత్యక్రియలకు హాజరయ్యారు.

Mercy Support for gulf Indians

MERCY ON SLUMS

గల్ఫ్ దేశాలకు వెళ్లిన భారతీయులు అనేకమంది ఏజెంట్ల మోసాలకు గురి అయి తీవ్ర కష్టాలకు లోనవుతున్నారు.వారిని ఆదుకోవడం కోసం కొందరు తెలుగువారు మెర్సీ ఆన్ స్లమ్స్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. దాని వివరాలను మిత్రులు ఆత్మచరణ్ గల్ఫ్ నుంచి రాసి పంపారు.దానిని ఈ వెబ్ సైట్ లో యధాతధంగా ప్రచురిస్తున్నాము.

మిత్రులారా!

బ్రతుకుదెరువు కొరకు విదేశాలకు అప్పులు చేసి వెళ్ళుతున్న వారు ఎన్నో కష్టాలు పడి వెళ్తుంటారు, అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకోని పరిస్తితులవలన ఆకస్మికముగా మరణించిన వారికి సహాయముగా ఉండాలని మరియు మా యొక్క ఆవేధనలతో ఏర్పరచిన MERCY ON SLUMS ఎంతో మంది గల్ఫ్ బాధితులకు ఆధారముగా నిలబడాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నాము.

గల్ఫ్ వెళ్లేవారికి వెళ్ళే స్తోమత లేకపోయినా కూడా వారు అప్పోసప్పో చేసి, ఏజెంట్లకు లక్షల రూపాయలు కట్టి, నెలల తరబడి వారి చుట్టూ తిరిగి, సొమ్మసిల్లిపోయి ఎదురు చూస్తుంటారు కాని ఏజెంట్లు మాత్రం వారికి నేలకోద్ది మోసగింపు మాటలు చెప్పి నమ్మిస్తారు. ఇలా సమయం గడిచే కొద్ది తీసుకున్న అప్పు సమయం దగ్గర పడుతుంది, ఇటు అప్పు కట్టలేక అటు విదేశాలకు వెళ్ళలేక చాల బాధలు పడుతుంటారు. అయితే కొందరు విదేశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉద్యోగాలు ఉన్నాకూడా తగిన సంపాదన లేక ఒత్తిడిలకు లోనవుతుంటారు, మరికొందరు సంపాదన ఆశించిన విధముగా ఉన్న కూడా వారి పైఅధికారుల చిన్న చూపుతో వారియొక్క బ్రతుకును గడపడం వారికి పెద్ద సమస్యగా మారుతుంది. ఇలాంటి బాధలను వారి మనసులో ఆలోచించుకుంటూ వారు ఉద్యోగాలకు వెళ్తున్న సమయంలో ఏ దారి ఎలాగా ధాటుతున్నారో కూడా తెలియకుండా ఆక్సిడెంట్ లకు గురి అవుతున్నారు.

ఇలాంటి ఏజెంట్ల మోసానికి గురవుతున్న వారికి అండదండలుగా ఉండాలన్న సదుద్దేశ్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేశాము.మీ అందరి సహకారంతో ఈ MERCY ON SLUMS ఎంతో మందికి అండగా నిలబడాలని కోరుకుంటున్నాము. Joel Chandra Mulugu, Bandaru Rajendra Prasad, Ramakrishna Chintha, Kurukelly Atmacharan, Narendher Gorre.
facebook-mercyonslumscreators ; e-mail- mercyonslums@gmail.com

Ramulu Died in Afghanistan


ఆఫ్గనిస్తాన్ లో బొంకూర్ వాసి మృతి మృతదేహాన్ని రప్పించడానికి గ్రామస్తుల విరాళం

డబ్బు సంపాదించాలని అప్పులు చేసి ఆఫ్గనిస్తాన్ వెళ్ళిన ఓ నిరుపేద వ్యవసాయ కూలీ అనారోగ్యంతో మృతి చెందాడు. గ్రామస్తుల విరాళాలు సేకరిస్తున్నారు. ఈ హృదయ విచారక సంఘటన గొల్లపల్లి మండలం బొంకూర్ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సూరమల్ల రాములు (38) అనే నిరుపేద వ్యవసాయ కూలీ ఏడాది క్రితం రూ. 1.20 లక్షలు చెల్లించి ఏజెంట్ ద్వాత ఆఫ్గనిస్తాన్ వెళ్ళాడు. అక్కడికెళ్ళాక కంపెనీ వీసా కాదని, ఏజెంట్ మోసం చేసాడని, కాని ఏజెంట్ గ్రామానికి చెందిన అడ్డుగట్టు చంద్రయ్య అప్పటికే ఢిల్లీ లో అనుమానాస్పద స్తితిలో మృతి చెందాడు. రాములుకు పని దొరకక రాములుకు పని దొరకక ఇంటి నుంచే కర్చులకు డబ్బులు తెప్పించుకుంటూ కలం గడిపాడు. ఈ క్రమం లో తీవ్ర అనారోగ్యానికి గురై సోమవారం మృతి చెందినట్లు కుటుంబసభ్యులకు సమాచారమందించారు. మృతదేహాన్ని స్వగ్రామం తీసుకురావటానికి రూ. 80 వేలు అవసరమని తెలుపడంతో కుటుంబసభ్యులు సర్దుబాటు చేసుకునే పరిస్టితి లేకపోవటం తో గ్రామస్తులే విరాళాలు సేకరిస్తున్నారు.

Alluri Anjanna Died in Saudi


స్వగ్రామం చేరిన గల్ఫ్ మృతదేహం

ఉపాధి కోసం సౌదీకి వెళ్లి అక్కడ అనారోగ్యంతో మృతి చెందిన మానాల వాసి అల్లూరి అంజన్న (50) మృతదేహం మంగళవారం స్వగ్రామం చేరింది. మృతదేహాన్ని చుసిన కుటుంబసభ్యులు బోరున విలంపించారు. గ్రామస్తులు సైతం కంటతడి పెట్టారు.అనంతరం అంత్యక్రియల నిర్వహించారు. 22 రోజుల తర్వాత శవం స్వగ్రామం చేరింది. ఉపాధి నిమిత్తం వెళ్లి ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన దుబాయి సంక్షేమ సంఘంలో అంజన్న సభ్యుడిగా ఉన్నాడు. శనివారం స్వగ్రామం చేర్చడంలో బాల్కొండ ఎమ్మేల్యే ఈరవత్రి అనిల్ తో పాటు దుబాయి సంక్షేమ సంఘం సభ్యులు ప్రత్యెక చొరవ తీసుకున్నారు. మ్రుతుడికి భార్య లక్ష్మి,ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు.

Life of gulf


గల్ఫ్ బ్రతుకు దెరువులు

బ్రతుకుదెరువు కొరకు ఎడారి దేశానికి వెళ్ళిన వారు అప్పులపాలై, అప్పులు తీర్చ లేక మరణానికి పాలుపడుతున్నారు.
వారికీ గల్ఫ్ వెళ్ళే స్తోమత లేకపోయిన కూడా, వారు అప్పోసోప్పో చేసి, ఏజెంట్లకు లక్షల రూపాయలు కట్టి,నెలల తరబడి వారు ఏజెంట్ల చుట్టూ తిరుగుతూ, సోమ్మసిల్లి పోతున్నారు. ఏజెంట్లు కూడా వారిని పంపిస్తామంటూ నమ్మ పలుకుతున్నారు, వారి చుట్టు నెలల, నెలలు తిప్పిచ్చికుంటున్నారు. అయితే ఇలా సమయం గడిచే కొద్ది తీసుకున్న అప్పు సమయం దగ్గర
పడుతుంది. అప్పు ఇచ్చిన వారు డబ్బులు కట్టమంటూ ఒత్తిడి చేస్తారు. గల్ఫ్ వెళ్ళాలని ఏజెంట్లకు డబ్బులు కట్టినవారు,
ఏజెంట్లు చెప్పిన మాటలు విని నెలల తరబడి వేచి చూస్తుంటారు. ఒక దిక్కు గల్ఫ్ కొరకు అప్పు ఇచ్చిన వారి ఒత్తిడి మరొక దిక్కు ఈ ఏజెంట్ల మోసగింపు మాటల వింటూ, వీరు ఒత్తిడ్లకు లోనవుతున్నారు. ఆ ఒత్తిడిని వారు మరిచిపోవడానికి మధ్యంత్రాగడం అలవాటు చేసుకొని ధానికి బానిసవులుతున్నారు. వారు కొన్ని నెలల నుండి పడుతున్న ఆ యొక్క బాధలను తట్టుకోలేక, ఇంటి వారితో కుడా తరచూ గొడవలు పడుతారు. మరి కొందరు ఆ పని చేయలేక వారు ఊరిలో తిని తిరుగుతూ,సోమరితనంతో పాటు దొంగతనాలకు మరియు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

గమనిక

ఒక సామాన్యమైన వ్యక్తి గల్ఫ్ వెళ్ళడానికి చేసిన అప్పు తీర్చలేక ఒక సోమరిపోతుల, ఒక దొంగల మరియు ఆత్మహత్యలకు పాలుపడుతున్నారు. కొంత మంది ఏజెంట్లు మాత్రం మాకు తెలిసిన కంపెనీలు ఉన్నాయి అంటు దుబాయి,సౌదీ, బెహ్రాన్, కతర్, ఒమన్,కువైట్,మలేషియా ,ఆఫ్గనిస్తాన్ మరియు ఇరాక్ లకు పంపిస్తామంటూ లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. వారిని మన దేశంలోని కొన్ని బ్రోకర్ కంపెనీలకు ట్రెయినింగ్ అంటు తిసకుపోతారు, వారికి రాని పనికుడా వచ్చినట్లు సర్టిఫికేట్ తయారు చేసి, మరి ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. తీరా కొన్ని రోజుల తర్వాత గల్ఫ్ వెళ్ళడానికి సమయం వచ్చింది అని చెప్పి వారిని విమాన మార్గమున్న పట్టణములలో వారిని ఉంచుతారు.

ఉదాహరణ

హైదరాబాద్, ముంబాయి, చెన్నై, నాగ్ పూర్ మరియు ఢిల్లీ లాంటి పట్టణంలో ఉంచుతారు. అక్కడికి చేరిన తర్వాత 2 రోజులలో మీ ప్రయాణం ఉందని చెప్పి వారికి 2,3 వారాల తర్వాత విమాన టికెట్ మరియు వీసా తీసుకువస్తారు, తీరా విమాన ఆశ్రయానికి వెళ్ళిన తర్వాత అందులోని ఈమిగ్రేషణ్ ఆఫీసర్స్ టికెట్ మరియు వీసా చూసి, ఈ పేరు మీద వీసా ఇష్యూ కాలేదు అని చెప్పి వారిని విమాన ఆశ్రయం బయటికి పంపిస్తారు. మరికొందరు ఏజెంట్లు లక్షల రూపాయలు వసూలు చేసి తమ దగ్గర పాస్ పోర్టులు పెట్టుకొని పంపిస్తమంటూ మోసగిస్తుంటారు.

కరీంనగర్ జిల్లా, సారంగాపూర్ మండలం రంగపేట గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అయితే గొల్లపల్లి మండలం, శంకరావుపేట చెందిన ఒక గల్ఫ్ ఏజెంట్ కు 2007 డిసెంబర్ లో
రూ 1 .20 లక్షలు మరియు పాస్ పోర్ట్ అప్పగించారు. ఏజెంట్ మాత్రం గల్ఫ్ (విదేశాలకు) పంపించకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేసాడు.

మరియొక సంఘటన

గల్ఫ్ పంపిస్తామని ఒక ఏజెంట్ మోసానికి పాల్పడ్డాడు. 6 నెలలుగా గల్ఫ్ పంపిస్తాడని వేచి చూసి విసికి చెందిన బాధితులు ఏజెంట్ ఇంటి ముందు క్రిమిసంహార మందు డబ్బాతో ఆత్మహత్య చేసుకుంటామని ఆందోళన చేశారు. కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన కొండాపూర్ కు చెందిన సబ్ ఏజెంట్ ద్వారా రూ 3.90 లక్షలు వసూలు చేసి గల్ఫ్ పంపిస్తామని చెప్పారు. 3 నెలల తర్వాత వారిని ఢిల్లీ వరకు తీసుకువెళ్ళి ఇంటికి తీసుకోని వచ్చాడు. వారిని గల్ఫ్ పంపించలేక ఈ సబ్ ఏజెంట్ ఆయన యొక్క ఆస్తి అమ్మి వారి డబ్బులు తిరిగి ఇచ్చాడు. ,కాని ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన ఏజెంట్ సబ్ ఏజెంట్ కు డబ్బులు ఇవ్వక జాప్యం చేస్తూ వచ్చాడు. దానితో విసికి పోయిన ఆ సబ్ ఏజెంట్ వారి యొక్క కుటుంబంతో కలిసి ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన ఏజెంట్ ఇంటి వద్ద ఆత్మహత్యకు పాల్పడ్డారు.

గమనిక

ఈ సంఘటనలో మనము గమనించవలసిన విషయం ఏమిటంటే, వారు డబ్బులు కట్టి నెలల తరబడి వేచి చూసి, నోటికి అందిన అన్నం ముద్ద చేజారినట్టుగా ఢిల్లీ వరకు వెళ్లి తిరిగి వచ్చి మరల వారి డబ్బు పొందుటకు ఎన్నో కష్టాలు పడి, వారి యొక్క పనిని మరియు గల్ఫ్ దేశాలకు వెళ్తామని వారి యొక్క బంధుమిత్రులతో పంచుకున్న సంతోషాలన్నీ అడియశాలుగా మిగిలి పోయాయి. ఇలా నలిగినా జీవితాలు మరి ఎన్నోఉన్నాయి. చెప్పుకుంటూపోతే గల్ఫ్ అనే ఒక్క మాట ఎంతో మంది జీవితాలను చిదిమి వేసింది. మరి కొందరు అవమానాలు మరియు అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చూడండి ఇలాంటి ఏజెంట్లు చేసిన మోసానికి ఎంతో మంది జీవితాలు బలి అవుతున్నాయి. ఈ సంఘటనలన్నిగల్ఫ్ వెళ్ళడానికి ముందే జరిగినవి, అయితే గల్ఫ్ వెళ్ళిన తర్వాత అక్కడ పడే కష్టాలను చుద్దాం.

గల్ఫ్ లో చేరిన తర్వాత కష్టాలు

ఏజెంట్లను నమ్ముకొని విదేశాలలో దిగిన తర్వాత, ఏజెంట్లు ఇచ్చిన కంపెనీల గురించి అడిగినప్పుడు , అటువంటి కంపెనీలు ఇక్కడ లేవు అని అక్కడి మనుష్యులు చెప్పినప్పుడు, వీరు నానా ఇబ్బందులు పడుతూ, ఎవరైనా మానవత్వంతో ఏక్కడైనా స్థలం ఇస్తే అందులో ఉంటాము అని తిరుగూతూ ఉంటారు, ఒకవేళ రూమ్ దొరికిన కూడా ఆ చిన్న రూమ్ లోనే 10-15 మంది వరకు ఉంటారు. ఒకరితో ఒకరు వారి యొక్క బాధలను చెప్పుకుంటూ, వచ్చిన దానికి చావో లేక బ్రతుకో ఇక్కడే గడిపేసి, ఏజెంట్లను నమ్ముకొని విదేశానికి వెళ్ళడానికి తెచ్చిన అప్పు తీర్చడానికి, వారు రోడ్ల మీద ఉన్నటిన్లు మరియు బల్దియా డబ్బాలలోనివి అమ్ముకుంటూ, వారు తినడానికి మరియు అప్పు తీర్చడానికి చేస్తారు. వారు రోడ్ల మీద ఉన్న ఆ టిన్లు మరియు బల్దియా వెతుకుతున్న సమయాలలో అక్కడి అధికారులు పోలీసులు) చుస్తే వారిని జైల్లో పెట్టి, బెదిరించి ఇంటి ధారి పట్టేల చేస్తారు.

ఏజెంట్లు చేసిన మోసానికి మరికొందరు నెలల తరబడి పనిలేక, ఇంటి దగ్గరి అప్పు తీర్చలేక గల్ఫ్ లో ఉన్నవారికి మనశ్శాంతి లేక ఇంటికి ఫోన్ చేస్తే, ఇక్కడ అప్పుల వాళ్ళు డబ్బులు ఎప్పుడు కడుతారు అని హెచ్చరిస్తున్నారు అని విన్నపుడు, ఇక ఇంటికి ఫోన్ చేసిన కూడా మనశ్శాంతి లేదు, అని కొందరు మనోధైర్యాన్ని కోల్పోయి, చనిపోవడానికి ప్రయత్నిస్తారు మరియు చనిపోతున్నారు.

మరికొన్ని ప్రాంతాలలో వారికి ఉద్యోగాలు ఉన్నాకూడా తగిన సంపాదన లేక ఒత్తిడిలకు లోనవుతారు. మరికొందరు సంపాదన ఆశించిన విధముగా ఉన్నా కూడా వారి పైఅధికారుల చిన్నచూపుతో వారి యొక్క బ్రతుకును నడపడం వారికి పెద్ద సమస్యగా మారుతుంది, ఇలాంటి బాధలు పడుతూ, వారు రాత్రిపూట వంట చేసుకొని , ఆ ఆహారం ను వారు ప్రొద్దున మరియు మధ్యాహ్న బోజనముగా తింటారు. బాధలతో వారు వారి యొక్క ఉద్యోగాలకు వెళుతున్న సమయంలో మది నిండా ఆలోచనలతో వారు ఎదారి ఎలా దాటుతున్నారో అని కూడా ఆలోచించకుండా రోడ్లు దాటుతున్న సమయంలో ఆక్సిడెంట్ కు గురి అవుతున్నారు.

కానీ ఇంటిదగ్గర మాత్రం తల్లిదండ్రులు, భార్య పిల్లలు, మరియు కుటుంబసభ్యులు ఎప్పుడువస్తాడ అని సంతోషముతో
ఎదురు చుస్తున్న్తారు, కానీ వచ్చేమనిషి ప్రాణంతో కాదు మరణించి వస్తున్నాడని తెలిసే సరికి, ఇంటిని కాపాడే కొడుకు మరణించాడని తల్లిదండ్రులు నిరువిల్లిపోతారు, ఎన్నో సంవత్సరాల తర్వాత భర్త తిరిగి వస్తాడు అనుకుంటే శవమై రాగానే భార్య జీర్ణించుకోలేక ఆమె తల్లడిల్లిపోతుంది, మా నాన్న వస్తాడని పిల్లలు ఎంతో సంతోషముగా వారిని ఆధారారిస్తాడని ఆనందముగా ఎదురు చూస్తుంటారు, నిజానికి నాన్నతిరిగిరాని లోకానికి వెళ్ళాడని ఆ చిన్నారులకు తెలియదు. మరి పిల్లలయొక్క తాత నాయనమ్మలు వారిని పోషించే శక్తిలేక, ప్రభుత్వంలో అర్జీలు పెట్టుకుంటారు, కానీ ప్రభుత్వాలు ఏనాడు కూడా పేదవారికి సరైన సమయంలో సహాయం అందక వారి యొక్క జీవితాలు ఆరంబంలోనే అంతం అవుతున్నాయి.

ఇలాంటి ఎజెంట్లచే మోసానికి గురైతున్న వారికి, పిల్లలకు మరియు ఇలా ప్రతి ఒక్కరికి ఆధారముగా మీ యొక్క మెర్సి ఆన్ స్లమ్స్ ఉదయించే సూర్యుడిలా చిగురిస్తున్న చిన్నారులకు, పావురమువలె ఎగిరిపోతున్న గల్ఫ్ వారికి మరియు భారతదేశం అనే మన ఇంట్లో ఎంతో మందికి ఆధారముగా నిలబడుతుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము. మరియు మీ అందరి సహకారంతో ఈ యొక్క మెర్సి ఆన్ స్లమ్స్ ను ఎంతో మందికి అండగా నిలబడాలని కోరుకుంటున్నాము ….!!!

హృదయ పూర్వకముగా మీ యొక్క మెర్సి ఆన్ స్లమ్స్

Agent Cheated the Sub Agent


ఏజెంట్ ఇంటి ముందు బాధితుల ఆందోళన గ్రామస్తుల జోక్యంతో విరమణ

గల్ఫ్ పంపిస్తానని ఓ ఏజెంట్ ఘరానా మోసానికి పాల్పడ్డాడు. ఆరున నెలలుగా గల్ఫ్ పంపిస్తాడని వేచి చూసి విసిగి వేసారిన బాధితులు ఆదివారం సదరు ఏజెంట్ ఇంటి ముందు క్రిమిసంహారక మందు డబ్బాతో ఆత్మహత్యాయత్నం చేసుకుంటామని ఆందోళన చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామానికి చెందిన మద్దుల బుగ్గరేడ్డి గల్ఫ్ పంపిస్తానని ముస్తాబాద్ మండలం కొండాపూర్ కు చెందిన సబ్ ఏజెంట్ బండి శ్రీనివాస్ ద్వార రూ. 3.90 లక్షలు వసూలు చేశాడు. దుర్గం చంద్రారెడ్డి, ఐలేని చంద్రం, కొండెం వెంకటరెడ్డి, బండి నర్సయ్యలను ఇరాక్ పంపిస్తానని డబ్బులు వసూలు చేశారు. మూడు నెల తర్వాత వారిని ఢిల్లీ వరకు తీసుకెళ్ళి ఇంటికి తీసుకువచ్చాడు. సబ్ ఏజెంట్ శ్రీనివాస్ తన భూములను అమ్మి నలుగురికి డబ్బులు చెల్లించాడు. బుగ్గరేడ్డి మాత్రం శ్రీనివాస్ కు డబ్బులు ఇవ్వక జాప్యం చేస్తువచ్చాడు. దీంతో విసిగిపోయిన శ్రీనివాస్ తన భార్య మంజుల, తల్లితండ్రులు మల్లయ్య, శాంతవ్వ, కుమారులు సాయిప్రసాద్, సతీష్ కుమార్ లతో కలిసి వచ్చి ఆత్మహత్య చేసుకుంటానని బుగ్గరేడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగాడు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులను ఆశ్రయించారు. డబ్బులు వచ్చేల ఒత్తిడి తేవాలని సముదాయించడం తో శ్రీనివాస్ ఆందోళనను విరమించాడు. గ్రామస్తుల హామిమేరకు స్వగ్రామానికి తిరిగి వెళ్ళాడు.

Narayan Died in Saudi

                             నారాయణ


సౌదీలో ఆర్మూర్ వాసి మృతి
పట్టణంలోని జేమ్మన్ జెట్టిగల్లికి చెందిన ఉట్నూర్ నారాయణ (32) సౌది అరేబియాలోని దమామ్ లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నారాయణ సంవత్సరం క్రితం బతుకుదెరువు నిమిత్తం ఐదేళ్ళ క్రితం దమామ్ వెళ్ళాడు. గల్ఫ్ వెళ్ళడానికి అప్పులు చేశారు. అప్పు ఇచ్చిన వారు తమ డబ్బులు చెల్లించాలని ఆర్మూర్ లోని నారాయణ కుటుంబీకులపై ఒత్తిడి చేశారు. అక్కడ జీతం తక్కువగా ఉండడంతో అప్పులు తీర్చే మార్గం కనిపించక జీవితం మీద విరక్తి చెందిన దమామ్ లో తన గదిలో నాలుగు రోజుల క్రితం ఊరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. మృతదేహాన్నిఆర్మూర్ కు తీసుకువచ్చే ఏర్పాటు చేయాలనీ స్తానిక నాయకులు ఎంపీ మధుయాష్కిగౌడ్ ను కలిసి కోరారు. ఎంపీ సౌది అరేబియాలోని భారత రాయబార కార్యాలయం అధికారులకు ఈ విషయమై లేఖ రాసినట్లు తెలిసింది. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు.

Ramesh is dead At working place in Dubai


గల్ఫ్ లో యశ్వంతరావుపేట వాసి మృతి

బతుకుదెరువు కోసం కన్నవారిని విడిచి ఎడారి బాట పట్టిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు బరువైన వస్తువు మీద పడి అక్కడిక్కడే మృత్యువాత పడ్డాడు. దీంతో ఆ కుటుంబంలో పండుగ రోజు తీరని విషాదం అలుముకుంది. మండలంలోని యశ్వంతరావుపేటకు చెందిన మందాల రమేష్ (28) అనే యువకుడు 18 నెలల క్రితం అప్పులు చేసి దుబాయి వెళ్ళాడు. అక్కడే ఓ కంపనీలో క్రేన్ ఆపరేటర్ గా పని చేసేవాడు. ఈ క్రమంలో గత శనివారం పై అంతస్తులో పనులు నిర్వహిస్తున్న క్రమంలో బలమైన వస్తువు మీద పడటంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ మేరకు అతడి స్నేహితులు కుటుంబసభ్యులకు సమాచారమందించారు. మృతుడికి భార్య రామ, ఈశ్వర్ (6), రిశ్వంత్ (4) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా అదే కంపనిలో గల్ఫ్ లో ఉంటున్న రమేష్ మూడేళ్ళ అనంతరం 10 నెలల క్రితం వచ్చి వెళ్ళాడు. గల్ఫ్ కోసం చేసిన అప్పులు తీరకముందే మృతి చెందటంతో యశ్వంతరావుపేట విషాదంలో మునిగిపోయింది. మరణ వార్త తెలియగానే అతడి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. మృతదేహాన్ని త్వరగా స్వగ్రామం చేరేల ఏర్పాట్లే చేసి బాధిత కుటుంబాన్ని ఆదుకుకోవాలని సర్పంచ్ తాండ్ర సత్యనారాయణ రావు ప్రభుత్వాన్ని కోరారు.

About MERCY Members

ఎడారిలో ఒయాసిస్సులు

ప్రార్థించే పెదవుల కన్నా.. సహాయం చేసే చేతులు మిన్న అని భావించారు. వీళ్లు ఉద్యోగ వేటలో ఎడారి దేశాలకు పరుగులు తీసి అక్కడ మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు నడుంబిగించారు. ఓ సంస్థను స్తాపించారు. పీకల్లోతు కష్టాల్లో కూరుకుపొయిన కుటుంబాలను ఓదార్చుతూ ఆర్థిక సహాయం అందజేస్తున్నారు.

ఆర్మూర్, న్యూస్ లైన్

బ్రతుకు దెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వారు అక్కడ ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కుటుంబ పెద్ద మరణంతో ఆ కుటుంబాలు పీకల్లోతు ఆ కుప్పల్లో కురుకుపోతున్నాయి. అలాంటి కుటుంబాలకు ఆడుకోవడానికి ఆర్మూర్ ప్రాంతానికి చెందిన పలువురు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. దేశం కాని దేశంలో మృత్యువాత పడ్డవారి కుటుంబాలను ఆడుకోవడానికి ప్రభుత్వాలు ముందు రాకున్న తమ వంతుగా ఏమైనా చేయాలనే సంకల్పంతో 'మెర్సి ఆన్ స్లమ్స్' పేరిట ఒక సంస్థను ఏర్పాటు చేశారు. నందిపేట మండలానికి చెందిన బండారు రాజేంద్ర ప్రసాద్, ఆర్మూర్ పట్టణానికి చెందిన కురుకేల్లీ ఆత్మచరణ్, జోయెల్ చంద్ర మూల్గు, ఆర్మూర్ మండలం పిప్రికి చెందిన చింత రామకృష్ణ, అంకాపూర్ కు చెందిన నరేందర్ మోరే ఇరాక్, సౌది అరేబియాలో పలు కంపనిల్లో పని చేస్తున్నారు. మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వీరంతా దేశ విదేశాల్లో ఉన్నప్పటికీ తమ ప్రాంతానికి చెందిన వారు అక్కడికి వచ్చి పడుతున్న కష్టాలను చూసి చలించిపోయారు. వాళ్ళకు ఏమైనా చేయాలనుకుని 'మెర్సి ఆన్ స్లమ్స్" అనే సంస్థను ఏర్పాటు చేశారు. విదేశాల్లో పలు ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడం ప్రారంభించారు. అందులో భాగంగా మార్చ్ లో మలేషియాలో ప్రమాదవశాత్తు మరణించిన భీమ్ గల్ మండలం బడా భీమ్ గల్ కు చెందిన నాగన్న కుటుంబ సభ్యులకు 10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఇటివల బహ్రేయీన్లో ప్రమాదవశాత్తు మరణించిన ఆదిలాబాద్ జిల్లా దిలావర్ పూర్ మండలం బన్సపల్లి గ్రామానికి చెందిన పోలా ముత్యం కుటుంబానికి 10 వేల ఆర్థిక సహాయాన్ని సోమవారం అందజేశారు. దేశ విదేశాల్లో ఉన్న వీరంతా పోగు చేసిన మొత్తాన్ని చెక్కు రూపంలో ఆర్మూర్ ప్రాంతంలో ఉంటున్న వారి కుటుంబ సభ్యులైన కోటేశ్వర్ రావ్, సూరజ్ లకు పంపుతారు. వీరిఇద్దరూ బాధిత కుటుంబాలను కలిసి స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు సమక్షంలో డబ్బులు అందజేస్తున్నారు.

• మెర్సి ఆన్ స్లమ్స్ స్థాపించిన ఆర్మూర్ వాసులు
• గల్ఫ్ మృతుల కుటుంబాలకు ఆర్ధిక సాయం
• దేశ విదేశాలకు విస్తరిస్తున్న వైనం

విస్తరిస్తున్న సేవలు........
స్నేహితుల మధ్య ప్రారంభమైన ఈ సేవలను మరింత విష్రుత పరచి భాదితులను ఆడుకోవడానికి వారు ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ఇంటర్నెట్ సహకారంతో తమ సంస్థలో మరింత మంది సభ్యులను చేర్చుకుంటున్నారు. కష్టాల్లో ఉన్న కుటుంబాలను వీరిని పలువురు అభినందిస్తున్నారు.


గల్ఫ్ బాధితులను ఆడుకోవడానికి


బతుకుదెరువు కోసం గల్ఫ్ బాట పట్టిన మనోళ్ళు కష్టపడతున్నారు. అలాంటి వారిని ఆదుకోవాలనే సంకల్పంతో మెర్సి ఆన్ స్లమ్స్ సంస్థను ఏర్పాటు చేశాం.

బండారు రాజేంద్ర ప్రసాద్, నందిపేట




బాధిత కుటుంబాలకు ఆసరా


గల్ఫ్ బాధిత కుటుంబాలకు ఎంతో కొంత ఆసరాగా నిలవాలనే ఈ సంస్థను ఏర్పాటు చేశాం. పెద్ద దిక్కు చనిపోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడుతోంది. వారికి కొంతైనా ఆసరా కావాలన్నదే మా ఆశ.

జోయెల్ చంద్ర మూల్గు, ఆర్మూర్



తోచిన సహాయం చేస్తున్నాం



గల్ఫ్ దేశాల్లో అకాల మరణం చెందిన వారి కుటుంబాలు అప్పుల పాలై దీన స్తితికి చేరుకుంటున్నాయి. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అందుకే మాకు తోచిన సహాయం చేస్తున్నాం.

కురుకేల్లీ అత్మచరన్, ఆర్మూర్



ప్రతి ఒక్కరు ముందుకు రావాలి


గల్ఫ్ బాధిత కుటుంబాలను ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నాయి. వారిని ఆదుకోవడానికి మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి.

చింత రామకృష్ణ, ఆర్మూర్

Mercy Financial Support


'మెర్సి ఆన్ స్లమ్స్'గల్ఫ్ బాధిత కుటుంబానికి ఆర్ధిక సాయం

మండలంలోని బన్సపల్లికి చెందిన గల్ఫ్ బాధిత కుటుంబానికి ఓ స్వచ్చంద సంస్థ సోమవారం దిలావర్ పూర్ లో తహసిల్దార్ నిజాముల్ హసన్ చేతుల మీదుగా రూ . 10 వేల ఆర్ధిక సాయం అందజేసింది. గల్ఫ్ బాధిత కుటుంబాలను ఆడుకొనేందుకు ప్రవాస భారతీయులు 'మెర్సి ఆన్ స్లమ్స్' పేరిట ఓ స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేశారు. గత నెలలో బహ్రెయిన్ లో విద్యుధాగతంతో బన్సపల్లి కి చెందిన పోల ముత్యం మరణించారు. కుటుంబ పోషణకర్త మరణంతో ముత్యం భార్య రాణి, 11 ఏళ్ల లోపు ముగ్గురు ఆడ పిల్లలు దిక్కుతోచని స్తితిలో పడ్డారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో మృతుడి భార్య పోల రాణికి ఈ సాయాన్ని అందించినట్లు సంస్థ ప్రతినిధులు నరేందర్ ఘోరే, కోటేశ్వర్ రావు, సురేష్ తెలిపారు. కార్యక్రమంలో బన్సపల్లి సర్పంచ్ శ్యాంసుందర్ రెడ్డి, ఆర్ఐ ఆనిరుద్, వి ఆర్వో వినోద్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Gangaram is Dead at Soudi


సౌదీలో దుంపేట వాసి మృతి
ఉపాధి నిమిత్తం గల్ఫ్ బాట పట్టిన కథలాపూర్ మండలం దుంపేట గ్రామానికి చెందిన మాతే గంగారం అలియాస్ ఎర్దండి (42) సౌది అరేబియాలో మృతి చెందారు. బుధవారం రాత్రి గుండెపోటుతో అతడు మృతి చెందినట్లు కుటుంబసభ్యులకు గురువారం సమాచారం అందింది. గంగారం పది నెలల కిందట రూ 1.50 లక్షలు అప్పుచేసి సౌది అరేబియా వెళ్లి దమామ్ ప్రాంతంలో పని చేస్తున్నారు. మ్రుతుడికి ఇద్దరు కూతుళ్ళు, ఒక కుమారుడు ఉన్నారు.

Yekbal is dead at Soudi


సౌదీలో తెర్లుమద్ది యువకుడి మృతి
మండలం లోని తెర్లుమద్దికి చెందిన ఎం.డీ. ఎక్బాల్ (24) సౌదీలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ దుర్వార్త కుటుంబీకులు, బంధువులకు ఆదివారం రాత్రి తెలిసింది. మృతుడి అన్న గపూర్, మేనమామ ఉస్మాన్ తదితరులు విలేకరులకు సోమవారం తెలిసిన వివరాల ప్రకారం.... గ్రామంలో ట్రాక్టర్ ద్రివేరుగా పని చేసే ఎక్బాల్ ఆర్థికంగా నిలదొక్కుకోడానికి రెండేళ్ళ కిందట రెండు లక్షల అప్పుచేసి గల్ఫ్ కు వెళ్ళాడు. అక్కడ ఓ కంపనీలో పని చేస్తున్నాడు. కాగ శనివారం కూరగాయలు తెచ్చుకోవడానికి
రోడ్డు దాటుతుండగా ఓ కారు వచ్చి డీకొట్టడంతో అతడు మృతి చెందాడు. ఈ విషయాన్ని అక్కడే ఉంటున్న గ్రామస్తుండొకరు ఫోన్ లో కుటుంబీకులకు తెలియజేశాడు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఎంపీపీ లక్ష్మికిషన్ రావు, సర్పంచ్ లక్ష్మి మల్లేశ్, టీర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ కోరుతున్నారు.

Balaiah Died in Saudi


సౌది అరేబియాలో చింతకుంట వాసి మృతి మృతదేహం కోసం కుటుంబ సభ్యుల నిరీక్షణ

ఉన్న ఊరిలో ఉపాధి కరవై జీవనోపాధి కోసం ఎడారి దేశాలకు వెళ్ళిన కరీంనగర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అక్కడే మృతి చెందాడు. ఇంటి నుంచి వెళ్ళిన రెండు నెలలకే చనిపోయినట్లు కుటుంబ సభ్యులకు సౌది నుంచి సమాచారం అందడంతో కన్నిరుమున్నిరుగా విలపిస్తున్నారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... చింతకుంట లోని తారక రామకృష్ణ నగర్ కు చెందిన బోనగిరి బాలయ్య (39) గ్రామంలోనే వ్యవసాయ కూలిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. తనకు తెలిసిన ఓ ఏజెంట్ ద్వార సౌది అరేబియాలో వ్యవసాయ కూలి పనిపై వెళ్లేందుకు వీసా పొందాడు. జూలై 20 న సౌది అరేబియా వెళ్ళిన ఆతను వీసా పొందడం కోసం రూ.2 లక్షల అప్పు చేసాడు. అయితే సౌది అరేబియా వెళ్లి రెండు నెలలు అవుతోంది. గత ఆదివారం బాలయ్య చనిపోయాడంటూ సౌదీలో ఉంటున్న బంధువులు బాలయ్య కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృత దేహాన్ని స్వగ్రామానికి తీసుకు వచ్చేందుకు రూ.2 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిపారు. అయితే వీసా కోసం చేసిన రూ.2 లక్షల అప్పునకే వడ్డీ కట్టలేని స్తితిలో ఉన్నామని, ప్రస్తుతం పూట గడవడమే భారంగా ఉన్న దుస్థితిలో మృతదేహాన్ని గ్రామానికి తీసుకు రావడానికి రూ.2 లక్షలు ఎక్కడి నుంచి తీసుకు వచ్చేదని కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం చొరవ చూసి మృతదేహాన్ని తీసుకు రావడానికి కృషి చేయాలనీ కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Chinnaya Die at Katar


ఖతర్ లో బాల్కొండ వాసి మృతి

బ్రతుకు దెరువు కోసం గల్ఫ్ లోని ఖతర్ వెళ్లి అక్కడ జరిగిన ప్రమాదంలో బాల్కొండ మండల కేంద్రానికి చెందిన బొండ్ల చిన్నయ్య (38) మృతి చెందాడు. బాల్కొండలోని ఆర్మూర్ గాలికి చెందిన చిన్నయ్య 9 నెలల క్రితం ఖతర్ దేశానికి వలస వెళ్ళాడు. ఆదివారం అక్కడ పని చేస్తుండగా ప్రమాదవశాత్తు గోడ కూలి మృత్యువాత పడ్డాడు. ఈ విషయం గురువారం ఆలస్యంగా కుటుంబ సభ్యులకు తెలియడంతో తీవ్రంగా రోదించారు. శవాన్ని రప్పించాలని కుటుంబసభ్యులు జిల్లా కలెక్టర్ ను కోరుతున్నారు. మృతుడు చిన్నయ్యకు భార్య ఇద్దరు కూతుళ్ళు, కొడుకు ఉన్నారు. చిన్నయ్య కుటుంబ సభ్యులను లీగల్ ఎయిడ్ కౌన్సిల్ అడ్వయిజర్ జగన్, మాజీ సర్పంచ్ గంగాధర్ పరామర్శించారు.

Odellu Dead by bad illness


ఉపాధి వేటలో చితికిన బతుకు

ఉపాధి కోసం ఉన్న ఊరును వదిలి వెళ్ళిన ఓ యువకుడు మృత్యఒడిలోకి చేరుకున్నాడు. చివరికి సాటి తెలుగు వారు సాయం అందించడంతో 17 రోజులకు మృతదేహం స్వగ్రామం చేరుకుంది. బందువుల కథనం మేరకు సుల్తానాబాద్ మండలంలోని ఐతరాజుపల్లికి చెందిన న్యాతరి ఓదెలు (38) ఉపాధి కోసం రెండేళ్ళ కిందట షార్జా వెళ్ళాడు. కాగ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఓదెలు గత నెల 22వ తేదిన మరణించాడు. ఓదెలు ఇంటి నుంచి షార్జా వెళ్లేందుకు బయలుదేరి ముంబాయి వరకు చేరుకున్నాకా అతని పెద్దకుమారుడు విద్యుధఘాతంతో మృతిచెందాడు. ఈ విషయం అతనికి తెలియకుండా బంధువులు జాగ్రత్తపడ్డారు. ఆరునెలలు షార్జాలో పని చేసిన తరువాత ఒదేలును కంపెనీ వారు విధులనుంచి తొలగించారు. గత కొంత కాలంగా అక్కడే కూలీ పని చేసుకుంటున్నా ఓదెలు అనారోగ్యం బారినపడ్డాడు. మెదడుకు శస్త్ర చికిత్ష కూడా చేయించుకున్నాడు. ఈ క్రమంలో తీవ్ర అనారోగ్యానికి గురైన అయన మృత్యువాత పడ్డాడు. దీంతో షార్జాలో స్థానికంగా ఉన్న తెలుగువారు విరాళాలు పోగు చేసి మృతదేహాన్ని ఐతరాజుపల్లికి పంపించారు. శుక్రవారం మధ్యాహ్నం మృతదేహం స్వగ్రామం చేరుకుంది. ఒదేలుకు భార్య,కుమారుడు ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ రవీందర్, ఎంపీటీసి సభ్యురాలు రాజమ్మ కోరారు.

Bala Lachayya sucide him self


ఉపాధి వేటలో 'చితికి' పోయిన బతుకు గల్ఫ్ నుంచి వచ్చిన యువకుడి ఆత్మహత్య

ఉపాధి కోసం ఎడారి దేశానికి వలస వెళ్ళిన ఆ యువకుడిని విధి వెక్కరించింది. గల్ఫ్ కు వెళ్లేందుకు చేసిన అప్పులు అతడిని వేదనకు గురిచేశాయి.ఎల్లారెడ్డిపల్లి మండలం వెంకటాపూర్ కు చెందిన పిట్టల బాల లచ్చయ్య (22) దుబాయి నుంచి వచ్చిన 25 రోజులకే బతుకు 'చితికి' పోయింది. శనివారం రాత్రి ఇంట్లోని ఓ దూలానికి ఉరివేసుకున్నాడు. గ్రామస్థుల కథనం ప్రకారం.. బాల లచ్చయ్య మూడేళ్ళ కిందట రూ. లక్ష బాకీ చేసి దుబాయికి వలస వెళ్ళాడు. రాత్రింబవళ్ళు కష్టపడినా యజమానులు వేతనాలు చెల్లించలేదు. చివరికి ప్రవాసాంధ్రుల విరాళాలతో స్వగ్రామానికి చేరుకున్నాడు. అప్పులు తీరే మార్గం కనిపించక కుమిలిపోయి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తల్లిదండ్రులు రాజవ్వ, నర్సయ్య రోదనలు వర్జనాతీతం, మృతునికి సోదరులు శ్రీకాంత్, కనకయ్య ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.

Mercy on Children


MERCY ON SLUMS

A Child is God's gift to the family. Each child is created in the special image and likeness of God for greater things to love and to be loved.


God told us, "Love your neighbors as yourself." So first we have to love ourselves rightly, and then love our neighbors. But how can we love ourselves unless we accept the way God has made us?


Many children are working in their childhood, roving through streets; Government is not doing much about this situation. Innocent children are lying on the roads and are forced by the circumstances to beg; every night they are not sure where they will spend it. There are children who are begging on the streets in the day and are spending their nights on the footpath. Most of them are naked without clothes and are collecting their food from the Garbage. Because of such circumstances, children are turning to robbery, joining underworld gangs and thus ruin their life. Since the underprivileged are living a very poor life their children are left with no choice.


We are the fortunate ones to have all kind of good things viz. education, food, shelter and all luxuries in life but such children cannot even think of basic necessity such as food. Any poor children who are interested in studies cannot think about it due to poverty.


Today’s youth:

Young boys and girls are addicted to sex, drugs, alcohol etc. to name a few. They are so much into these habits that they have become slaves to it. There are number of cases of young unmarried girls who give birth to children and then dump them in the garbage, to be eaten by stray dogs and if any survive only to beg on the streets.


Most of us think it is not our problem; with such attitude we will never be able to do things for others. We have to support such children, young people and others who need our support by way of providing the primary requirements such as food and clothes and thus give a better future for the poor children.

You can make a difference by Sponsoring a Child.

In today’s busy schedule people are busy in their own world, it might not be possible to help on individual level, but we surely can contribute a little and help such children…… remember each small drop counts.

Hence a small group of Indians in Gulf have gone a step ahead and started MERCY ON SLUMS by our compassion with the main aim to help the downtrodden, exploited, and poverty stricken children.

How can YOU help?

In any event, your active participation is important. We would greatly appreciate if you pass this information to friends, acquaintances and colleagues so that you can help our MERCY ON SLUMS to become well known in the public. There are many ways that you can help. If you have a good idea or would like to participate actively in our work for the children in India, please contact us at one of the following addresses. We will gladly provide you with more detailed information.

E-mail : mercyonslums@gmail.com


Heart fully MERCY ON SLUMS…!!!!

Mr. B.R. Prasad Alias Bandaru Rajendra Prasad
Mr. Joel Chandra Alias Chandra Kumar Mulugu
Mr. Nani Alias Ramakrishna Chintha

MERCY ON SLUMS


గల్ఫ్ మృతుల కుటుంబాలకు బాసట "మెర్సి ఆన్ స్లమ్స్"

ఆర్మూర్, ఏప్రిల్4 (ఆన్ లైన్) బ్రతుకు దెరువు కోసం గల్ఫ్ వెళ్లి మృతి చెందినా వారి కుటుంబాలను ఆదుకోవాలని ఇరాక్ లోని తెలుగువారు నిర్ణయించుకున్నారు. ఇటీవల ఆంధ్రజ్యోతి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా టబ్లాయిడ్లల లో ప్రచురితమైన గల్ఫ్ మృతుల కుటుంబాల దీనగాతలకు వారు చలించిపోయారు. ఈ మేరకు ఆంధ్రజ్యోతి సాయంతో రెండు కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ఇరాక్ కేంద్రంగా ప్రవాసీయులు నడుపుతున్న "మెర్సి ఆన్ స్లమ్స్" సంస్థ ముందుకు వచ్చింది. చెత్తకుప్పలు, మురికివాడల్లో మగ్గుతున్న పిల్లల, కుటుంబ పెద్దల్ని కోల్పోయి భవిష్యత్ అందకారంగా మారిన చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపేందుకు పలు కార్యక్రమాలను ఈ సంస్థ చేపడుతుంది.

ఇటివల నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ మండలం బడా భీమ్ గల్ కు చెందిన కొండూర్ నాగన్న (50) మలేషియాలో మరణించారు. ఆదిలాబాద్ జిల్లా బంసపల్లి చెందిన పోలా ముత్యం (33) కూడా గల్ఫ్ లో మరణించారు. వీరు గల్ఫ్ లో మరణించినట్లు ఆంధ్రజ్యోతి లో కథనం రాగ వీరి కుటుంబాలను ఆదుకుంటామని "మెర్సి ఆన్ స్లమ్స్" ప్రతినిధులు ప్రకటించారు. బ్రతుకు దెరువు కోసం వచ్చి గల్ఫ్ లో మరణించడం తమనేంతో బాదించిందని ఆ పేద కుటుంబాల్లోని పిల్లల భవిష్యత్ ను కాపాడేందుకు ఆర్ధిక సాయం చేసేందుకు సిద్దమయ్యామని సంస్థ ప్రతినిధులు జోయెల్ చంద్ర అలియాస్ చంద్రకుమార్ మూల్గు, బండారు రాజేంద్ర ప్రసాద్, రామకృష్ణ చింత తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన వీరు ఇరాక్ లోని కేబీఆర్ అనే అమెరికన్ కంపెనీ ఉద్యోగులు.

స్థానికంగా ఉపాది లేక అప్పోసోప్పో చేసి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి ప్రధానంగా యువకులు గల్ఫ్ వెళ్తున్నారు. అక్కడ ఏదైనా ప్రమాదంలో మృతి చెందితే ఇక కుటుంబం ఆశలు, ఆధారం కోల్పోయినట్లే. నెలల తరబడి ఎదురు చూసిన మృతదేహం స్వదేశానికి చేరదు. అది వచ్చేవరకు ఏడ్చే కన్ను ఆగదు. మరోవైపు కుటుంబ పెద్దను కోల్పోవడంతో అప్పుల వారి వేధింపులు తీవ్రమవడంతో పలు పేద కుటుంబాలు సర్వం కోల్పోయి రోడ్డు పాలవుతున్నాయి. ఇలాంటి కుటుంబాల్లోని పిల్లలది మరి దారుణం. భవిష్యత్ అంతా అందకారంగా మారిపోతుంది. అలంటి పరిస్తితే నాగయ్య. ముత్యం కుటుంబాలది. అలాంటి పిల్లల కోసమే కొంతలో కొంత సాయనికైనా మేం సిద్దమవుతున్నాం. ఆంధ్రజ్యోతి సహకారంతో బాధిత కుటుంబాలకు సాయపడాలని నిర్ణయించుకున్నాం,, అన్నారు జోయెల్ చంద్ర. మానవతా మూర్తులు ముందుకు వచ్చి తమను ఆదుకోవాలని ఆ కుటుంబాలను కోరుతున్నారు. నాగన్న భార్య ప్రస్తుతం బడా భీమ్ గల్ లోనే ఉంటోంది. ఆ కుటుంబానికి సాయపడలనుకునే దాతలు mersyonslums@gmail.com సంప్రదించవచ్చు.

Pochayya dead by Heart attack in soudi


సౌదీలో గుండె పోటుతో మృతి చెందిన పోచయ్య

కోహెడ మండలం రామచంద్రాపూర్ కు చెందిన బోలుమల్ల పోచయ్య అనే వ్యక్తి సౌది అరేబియాలో గుండె పోటుతో మృతి చెందాడు. మూడు నెలల క్రితం అక్కడికి వెళ్ళిన అతను ఈ నెల 8 వ తేదిన మృతి చెందినప్పటికి కుటుంబసభ్యులకు సమాచారం రాలేదు. అతని భార్య, ముగ్గురు పిల్లలుండగా పెద్ద కొడుకు సంపత్ గుండె జబ్బుతో బాధపడుతున్నట్లు బంధువులు తెలిపారు. మృతదేహాన్ని నాలుగైదు రోజుల్లో తెప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు మీరంజని హెల్ప్ లైన్ జిల్లా ఇన్ ఛార్జ్ షేక్ చాంద్ షాషా తెలిపారు.

Balaraju Dead by Accident in Dubai


స్వగ్రామం చేరిన గల్ఫ్ మృతదేహం

సిరిసిల్ల మండలం గ్రామానికి చెందిన ఎర్ర బాలరాజు (42) గ్రామంలో కూలీ పనులు చేస్తూ భార్య పిల్లలను పోషించుకుంటున్నాడు. గ్రామంలో ఉపాధి కరువై బాలరాజు మూడేళ్ళ క్రితం రూ. 1.50 లక్షల అప్పు చేసి దుబాయికి వెళ్ళాడని గ్రామస్తులు తెలిపారు. సుతారీ కార్మికుడిగా పని చేస్తుండేవాడన్నారు. ఏడాది క్రితం పెద్ద కుమార్తె ప్రియాంకకు రూ. 3 లక్షల కట్నం ఇచ్చి వివాహం చేసారు. అయితే కుమార్తె పెళ్ళికి వచ్చి పోతే మరో రూ. 2 లక్షలు అప్పులు చేయల్సివస్తుందని పెళ్ళికి రాకుండా అక్కడే ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఉగాది పండుగకు డబ్బులను పంపించాలంటూ భార్య దుర్గవ్వ బాలరాజుకు ఫోన్ చేయడంతో డబ్బులను పంపించేందుకు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న బాలరాజును కారు డీ కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. అదే ప్రాంతంలో ఉన్న జిల్లెలకు చెందిన కొందరు గ్రామస్తులకు సమాచారం అందించారు. చందాలు పోగు చేసి జిల్లెలకు మృతదేహాన్ని తరలించారు. ఇంటి పెద్ద దిక్కు కోల్పోయిన ఆ కుటుంబం రోదనలు మిన్నంటా

Two South Indians were dead in soudi



గల్ఫ్ లో ఇద్దరు మృతి చెందారు. పనులు చేసుకుంటుండగా ఒకరు, జైల్లో శిక్ష అనుభవిస్తూ మరొకరు గుండె పోటుతో మృతి చెందారు. మండలంలోని సముద్రలింగాపూర్ చెందిన కొమ్మన్నపెల్లి సాయిలు (50) , పుట్టయ్య (49) సౌదీలో మరణించారు. సాయిలు మూడేళ్ళ క్రితం గల్ఫ్ వెళ్ళగా అక్కడి పోలీసులకి చిక్కి జైలుపాలై రెండు రోజుల క్రితమే సౌదీకి వెళ్ళగా అక్కడ పని చేసుకుంటుండగానే గుండె ఆగి మృతి చెందాడు. దీంతో వీరి కుటుంబాలు దుఃఖంలో మునిగాయి. మృతులకు బార్య పిల్లలు ఉన్నారు.

Soudi Police Arrested South Indians



సౌది జైల్లో జిల్లా వాసుల నరక యాతన
పట్టించుకోని భారత రాయబార కార్యాలయం
భర్తను విడిపించాలని సత్తమ్మ వేడుకోలు

సౌదీ అరేబియా జైల్లో మగ్గుతున్న ప్రవాస భారతీయులు నరకాన్ని చవిచూస్తున్నారు. ఆదుకుంటుదనుకున్న భారత రాయబార కార్యాలయం స్పందించకపోవడం, అక్కడి అధికారులు శ్రుతిమించి వ్యవహరించడంతో జైల్లో మగ్గుతున్న జిల్లా వాసులు కన్నీరు మున్నీరవుతున్నారు. అలికిడైతే చాలు ఏమి జరుగుతుందోనని ఉలిక్కిపడుతున్నారు. ప్రాణాలతో ఇంటికి తిరిగి వెళ్తామ అని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే, మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామానికి చెందిన పాల్తేపు జలపతి 2008 ఏప్రిల్ 24 న బతుకు దెరువు కోసం ఆజాద్ వీసాపై సౌదీ అరేబియా వెళ్ళాడు. అక్కడ కపిల్(దళారీ) జలపతి పాసుపోర్టును తీసుకోని పనిలో నియమించుకున్నాడు. మూడు నెలల పని సాఫీగా చేశాక విదుల్లోనే ప్రమాదం జరిగి జలపతి కాలు విరిగింది. ఆజాద్ వీజాపై పనిచేస్తుండడంతో సొంత డబ్బులతో వైద్యం చేయించుకోవాలని దళారీ జలపతిని సూచించాడు. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతుండగా అక్కడి పోలీసులు పాసుపోర్టు లేదనే నెపంతో అరెస్ట్ చేసి రియాద్ సఫార్ జైల్లో (జీఎంసి) లో పెట్టారు. పాసుపోర్టు కోసం తుదికంట ప్రయత్నించిన దళారీ పాసుపోర్టును ఇవ్వకపోవడంతో జలపతి సౌదీ జైల్లోనే మగ్గుతున్నాడు. జలపతితో పాటే జైళ్లో చేరిన కేరళకు చెందిన ఓ యువకుడు తిండిలేక తమ కళ్ళెదుటే మరణించాడని జలపతి "న్యూస్ టుడే" తో మంగళవారం రాత్రి ఫోన్ లో వాపోయాడు. జలపతితో పాటే జగిత్యాల మండలం హిమ్మత్ రావు పేట గ్రామానికి చెందిన కొండయ్యతో పాటు మరికొంత మంది జిల్లా వాసులు సౌదీ జైళ్లో మగ్గుతున్నారని వారు తెలిపారు. తన భర్త సౌదీ జైళ్లో దుర్బర జీవితం గడుపుతున్నాడని తెలిసిన భార్య సత్తమ్మ తిండి తిప్పలు మాని భర్త తిరిగివస్తే చాలని దేవుడిని వేడుకొంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తన భర్తను జైలు నుంచి విడిపించాలని రోదిస్తుంది. రెక్కాడితే గాని డొక్క నిండని పరిస్తితుల్లో జీవనం సాగిస్తున్న తమను ఆదుకోవాలని సత్తమ్మ రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టిస్తుంది.

Mercy Financial Support K. Naganna


గల్ఫ్ బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

భీమ్ గల్ మండలం బడ భీమ్ గల్ కు చెందిన గల్ఫ్ మృతుడు కే.నాగన్న కుటుంబానికి ఇరాక్ లోని మెర్సి ఆన్ స్లమ్స్ సంస్థ వారు పది వేల రూపాయలను సోమవారం అందజేశారు. నాగన్న (48)
మార్చి 28 న మలేషియాలో మరణించగా ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది. దీనికి స్పందించి మెర్సి ఆన్ స్లమ్స్ ప్రతినిధులు రాజేంద్రప్రసాద్ జోయెల్ చంద్ర నాగన్న భార్య నర్సుబాయికి నగదు అందజేశారు. వీరి వెంట ఎంపీటిసి ముత్తెన్న, ఉపసర్పంచ్ మోహన్ ఉన్నారు.

Children



మన కుటుంబానికి పిల్లలు దేవుడు ఇచ్చిన వరము, ప్రతి పిల్లలు ప్రత్యేకముగా జన్మించారు, దేవునికి ఇష్టమైన అపురూపము, ప్రేమించు మరియు ప్రేమించబడు.

ఎంతో మంది పిల్లలు వెట్టి చాకిరీ చేయడం, వీధిన పడి తిరగడం, ప్రభుత్వం వారికీ తగిన విధముగా తోడుపడకపోవడం, తెలిసి తెలియని వయస్సులో పిల్లలు రోడ్ల మీద అడుక్కోవడం, సాయంత్రం అయ్యేసరికి ఎ గూటికి చేరాలో తెలియక రోడ్ల మీద పడుకుంటూ, చెత్తకుప్పలో వేసిన వాటిని ఏరుకొని తినడం, కట్టుకోడానికి బట్టలు, తినడానికి అన్నం లేక, ఎంతో మంది అనారోగ్యలతో మరణించడం, మరికొందరు దిక్కుతోచని చిన్నారులు. చిన్న తనంలోనే దొంగతనాలకు అలవాటుపడుతూ, వారి యొక్క భావి తరాలకు చేరగని మచ్చగా నిలిచిపోతున్నారు.

ఒకవేల చిన్నారులకు తల్లిదండ్రులు ఉన్న కుడా,వారి యొక్క తల్లిదండ్రుల పేదరికం వలన, ఆ పసి పిల్లలు కుడా అదే బాటలో నడుస్తున్నారు. ఆ పిల్లలకు చదువుకోవాలని ఎంతో ఇష్టం ఉన్న కుడా, చదువుకోలేని పరిస్థితి. ఎందుకంటే వారికీ సరైన సహాయము లేక, వారికీ ప్రభుత్వం నుండి సరియైన సహాయము అంధక వారు ఆ చెత్త కుప్పల దగ్గరనే మగ్గిపోతున్నారు.
మన ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటె మనము ఎన్నో కళలు కంటూ ఉంటాము, వారిని ఎంతో గొప్ప వారిగా, వారియొక్క భావిష్యతులో ఉన్నతమైన స్థానం పొందాలని మనము తాపత్రయపడుతూ వారికి ఉన్నత చదువు అందిస్తూ ఉంటాము. మరి ఎ అండ దండ లేని ఈ చిన్నారులకు కనీసం ఒక్క పుట కూడా గడవని వారికి, చదువు చేతికి అందనంత దూరంలో ఉంది.

ఇలా జరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి:

* యవనస్తులైన స్త్రీ పురుషులు చెడు అలవాటులకు భానిసలై, స్త్రీ గర్బం ధరించి, పిల్లలను కని, చేత్తకుప్పలలో, రోడ్ల మీద, ప్రభుత్వ ఆసుపత్రిలలో పడేసి వెళ్ళుతున్నారు, ఆ పసి కంధులను కుక్కలు కొరికి చంపడం. కొందరు అనాధలుగా పెరగడం, రోడ్ల మీద పడి అడుక్కోవడం, ఇట్టి పరిస్థితులను ఎదురుకుంటున్న చిన్నారులు, ఈ లోకములోనే పుట్టడము పాపమా?ఇటువంటి పరిస్థితులను ఎదురుకుంటున్న చిన్నారులకు, మన యువత చేయూత నివ్వాలని వారికీ అండ దండగ నిలిచి, వారిని ఆదుకొని, వారి యొక్క పరిస్థితులను అర్ధం చేసుకొని, వారికీ తగిన చదువు, ఆహరం, బట్టలు, అన్నిటికి తోడుపడి,

ఏ చిన్నారికూడా అమ్మ, నాన్న మరియు బంధుమిత్రులు లేరని వారి మనసులోనికి రాకుండా, మనమంతా వారికీ సహాయముగా ఉండాలని మరియు మా యొక్క ఆవేధనలతో ఏర్పరచిన MERCY ON SLUMS ఎంతో మంది అనాధపిల్లలకు, పేదరికంతో బాధపడుతున్న వారికీ, ఆకస్మిక పరిస్థితులకు గురైన వారికీ, మరియు ఇంకా ఇలాంటి బాధలను ఎదురుకుంటున్న చిన్నారులకు ఆధారముగా నిలబడుతుందని మనస్పూర్తిగా కోరుకుంటూ....
మీ యొక్క MERCY ON SLUMS..!!!


మా యొక్క MERCY ON SLUMS గురించి మీరు మీ స్నేహితులకు, తోటివారికి, మరియు తెలిసిన వారికీ తెలియజేస్తే మాకు తోడుపడిన వారుగా గుర్తించ బడును. మరల మీ ద్వార MERCY ON SLUMS గురించి అందరికి తెలిసే అవకాశాలు ఉన్నాయి. మీరు సహాయం చేయాలి అనుకొంటే మీరు ఎన్నో విధానాలుగా చేయవచ్చు దయ చేసి ఈ క్రింది వివరాలకు సంప్రదించండి. ఈ సమాచారానికైన మేము ఎంతో ఉత్సాహముగా తెలియజేయగలము.


సూచనా: ఇది కులమతాలకు, చిన్న పెద్ద, బేధాలు లేకుండా మానవత్వంతో సాటివారిని ఆదుకోవడానికి కలిసి కట్టుగా తోడుపడాలని కోరుకుంటున్నాము.

వివరములకు : MERCY ON SLUMS.
E-mail : mercyonslums@gmail.com

Gonda Babu is Dead in Dubai


మండల కేంద్రంలోని సుబాస్ నగరుకు చెందినా గొండబాబు (38 ) దుబాయిలో మంగళవారము రాత్రి అనారోగ్యంతో మరణించాడు. అక్కడ ఉన్న తమ బందువుల ద్వార బుధవారము ఉదయము ఈ విషయము తెలిసిందని మృతుడి బార్య గంగమని రోదీస్తూ తెలిపింది. గతేడాది లక్ష రూపాయలు వరకు అప్పు చేసి దుబైలోని అల్కొష్ నగరంలో కూలి కోసం తన బర్త వెళ్ళాడని పేర్కొంది. 6 నెలల క్రితం ఒకసారి నవీపేటకు వచ్చి వెళ్ళాడని ఆమె వివరించింది. తనకు గణేష్ (9) దీపిక (5) ఉందని వెల్లడించింది. ఇప్పుడు తమ పరిస్టితి ఏమిటని ఆమె రోదించింది. ప్రబుత్వం తన కుటుంబాన్ని ఆదుకోవాలని తన బర్త మృతదేహాన్ని తీసుకురావడానికి కృషి చెయాలని ఆమె విజ్ఞప్తి చేసింది. ఎంపిపి సూరిబాబు బాదిత కుటుంబాన్ని పరామర్శించి ప్రబుత్వం తరపున సహాయము అందే విదంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Rajeshwar is Dead in dubai on roda accident



దుబాయ్ లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మల్లాపూర్ మండలం రేగుంటకు చెందిన సోమ రాజేశ్వర్ రెడ్డి (32) మృతి చెందినట్లు కుటుంబ సబ్యులకు సమాచారం అందింది. వారి కథనం ప్రకారం రాజేశ్వర్ రెడ్డి నాలుగేళ్ళుగా దుబాయ్ లోని ట్రై ఎలక్ట్రో కంపెనీ లో లేబర్గా పని చేస్తున్నాడు. నాలుగు నెలల కింద సెలవుపై వచ్చి వెళ్ళాడు. శనివారం కంపెనీకి చెందిన వస్తువులను దుబాయ్ నుండి అబుదాబికి ట్రాన్స్ పోర్ట్ చేస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని వెనుకనుండి వస్తున్న ట్రక్కు డీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడికి బార్య జల , ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి తెప్పించేందుకు అధికారులు కృషి చేయాలని సర్పంచ్ రామగౌడ్ కోరారు.

How We Support Gulf People


మీ యొక్క మెర్సి ఆన్ స్లమ్స్ పేదరికంతో బాధపడుతున్న వారికీ, ఆకస్మిక పరిస్థితులకు గురైన వారికీ, గల్ఫ్ బాధితులకు (విదేశాలకు బ్రతుకుదెరువు కొరకు అప్పులు చేసి వెళ్ళుతున్న వారు మధ్యలో ఏజంట్ల చేత మోసపోవడం కొన్ని కంపెనీలలో వారికీ తగిన ఉద్యోగాలు లేకపోవడం మరియు అధికారులు చిన్న చూపు చూడడం వలన అక్కడి పరిస్తితులు బాధలవలన స్వదేశానికి తిరిగి రావడం, వారు చేసిన అప్పులను తీర్చడానికి తగిన స్తోమత లేక వారు పురుగుల మందులు త్రాగి, ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. కొన్ని ప్రాంతాలలో నాయకులు మేము ఆధారిస్తున్నమంటూ కొన్ని పత్రికలలో, టీవీలలో ప్రచారించడం జరుగుతుంది అది మనము చూస్తున్నాము, వింటున్నాము, కాని వారు ఎవరికీ కూడా సహాయం అందించడం లేదు. ఏ రోజైన మన బంధుమిత్రుల, కుటుంబాలలో గల్ఫ్ బాధితులకు ఏ విధమైన సహాయం అందింద? అవును అందింది, ఏప్పుడు అంటే అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలు చెసుకున్న తర్వాత. మన ప్రాంత నాయకులూ సహాయం చేస్తున్నామంటూ ప్రచారాలు చేస్తూ కొన్ని డబ్బులు ఇస్తున్నారు, కాని ఒక చిన్న గమనిక మన ప్రాణం పోయిన తర్వాత మనకు ఆ డబ్బు ఎందుకు?) మరియు ఇంకా ఇలాంటి బాధలను ఎదురుకుంటున్న బాధితులకు ఆధారముగా నిలబడలని మనస్పూర్తిగా కోరుకుంటూ

మీ యొక్క మెర్సి ఆన్ స్లమ్స్

Naga Raju and Shanker Cheated By Agent



గల్ఫ్ కు పంపిస్తానని మోసగించిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు:

కమాన్ పూర్, న్యూస్ టుడే: నిరుద్యోగులైన యువకులను సింగపూర్, దుబాయ్ వంటి దేశాలకు పంపిస్తానంటూ నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై ఆదివారం బాదితులు కమాన్పూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మండల పరిధిలోని జూలపల్లి గ్రామానికి చెందిన బోల్లపెల్లి జగన్ గౌడ్ తమను విదేశాలకు పంపిస్తానని రూ.3 లక్షల గ్రామానికి చెందిన మల్హర్ మండలం పెద్దతూండ్ల గ్రామానికి చెందిన గుండా నాగరాజు, వెనిశెట్టి శంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే కమాన్ పూర్కు చెందిన మంద రాజయ్య, బాలకృష్ణల వద్ద నుండి జగన్ రూ. 2 .75 లక్షలు తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ఐ.పి నోటిసులు పంపించారని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కమాన్ పూర్ ఎస్.ఐ వెంకటేశ్వర్లును కోరారు. జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన యువకులు 16 మందికి ఇలా ఐ.పి నోటిసులు జారి చేసి జగన్ పరారిలో ఉన్నాడని వారు తెలిపారు.

Gulf Indians

Indians working in Gulf are also facing problems of different stature. Many agents are duping innocent candidates who want to work in Gulf. There is no legal system through which they can be booked for cheating the innocent and these poor victims are left with no choice and take the drastic step of committing suicide.

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites