Ramulu Died in Afghanistan


ఆఫ్గనిస్తాన్ లో బొంకూర్ వాసి మృతి మృతదేహాన్ని రప్పించడానికి గ్రామస్తుల విరాళం

డబ్బు సంపాదించాలని అప్పులు చేసి ఆఫ్గనిస్తాన్ వెళ్ళిన ఓ నిరుపేద వ్యవసాయ కూలీ అనారోగ్యంతో మృతి చెందాడు. గ్రామస్తుల విరాళాలు సేకరిస్తున్నారు. ఈ హృదయ విచారక సంఘటన గొల్లపల్లి మండలం బొంకూర్ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సూరమల్ల రాములు (38) అనే నిరుపేద వ్యవసాయ కూలీ ఏడాది క్రితం రూ. 1.20 లక్షలు చెల్లించి ఏజెంట్ ద్వాత ఆఫ్గనిస్తాన్ వెళ్ళాడు. అక్కడికెళ్ళాక కంపెనీ వీసా కాదని, ఏజెంట్ మోసం చేసాడని, కాని ఏజెంట్ గ్రామానికి చెందిన అడ్డుగట్టు చంద్రయ్య అప్పటికే ఢిల్లీ లో అనుమానాస్పద స్తితిలో మృతి చెందాడు. రాములుకు పని దొరకక రాములుకు పని దొరకక ఇంటి నుంచే కర్చులకు డబ్బులు తెప్పించుకుంటూ కలం గడిపాడు. ఈ క్రమం లో తీవ్ర అనారోగ్యానికి గురై సోమవారం మృతి చెందినట్లు కుటుంబసభ్యులకు సమాచారమందించారు. మృతదేహాన్ని స్వగ్రామం తీసుకురావటానికి రూ. 80 వేలు అవసరమని తెలుపడంతో కుటుంబసభ్యులు సర్దుబాటు చేసుకునే పరిస్టితి లేకపోవటం తో గ్రామస్తులే విరాళాలు సేకరిస్తున్నారు.

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites