స్వగ్రామం చేరిన గల్ఫ్ మృతదేహం
సిరిసిల్ల మండలం గ్రామానికి చెందిన ఎర్ర బాలరాజు (42) గ్రామంలో కూలీ పనులు చేస్తూ భార్య పిల్లలను పోషించుకుంటున్నాడు. గ్రామంలో ఉపాధి కరువై బాలరాజు మూడేళ్ళ క్రితం రూ. 1.50 లక్షల అప్పు చేసి దుబాయికి వెళ్ళాడని గ్రామస్తులు తెలిపారు. సుతారీ కార్మికుడిగా పని చేస్తుండేవాడన్నారు. ఏడాది క్రితం పెద్ద కుమార్తె ప్రియాంకకు రూ. 3 లక్షల కట్నం ఇచ్చి వివాహం చేసారు. అయితే కుమార్తె పెళ్ళికి వచ్చి పోతే మరో రూ. 2 లక్షలు అప్పులు చేయల్సివస్తుందని పెళ్ళికి రాకుండా అక్కడే ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఉగాది పండుగకు డబ్బులను పంపించాలంటూ భార్య దుర్గవ్వ బాలరాజుకు ఫోన్ చేయడంతో డబ్బులను పంపించేందుకు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న బాలరాజును కారు డీ కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. అదే ప్రాంతంలో ఉన్న జిల్లెలకు చెందిన కొందరు గ్రామస్తులకు సమాచారం అందించారు. చందాలు పోగు చేసి జిల్లెలకు మృతదేహాన్ని తరలించారు. ఇంటి పెద్ద దిక్కు కోల్పోయిన ఆ కుటుంబం రోదనలు మిన్నంటా