గల్ఫ్ బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
భీమ్ గల్ మండలం బడ భీమ్ గల్ కు చెందిన గల్ఫ్ మృతుడు కే.నాగన్న కుటుంబానికి ఇరాక్ లోని మెర్సి ఆన్ స్లమ్స్ సంస్థ వారు పది వేల రూపాయలను సోమవారం అందజేశారు. నాగన్న (48)
మార్చి 28 న మలేషియాలో మరణించగా ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది. దీనికి స్పందించి మెర్సి ఆన్ స్లమ్స్ ప్రతినిధులు రాజేంద్రప్రసాద్ జోయెల్ చంద్ర నాగన్న భార్య నర్సుబాయికి నగదు అందజేశారు. వీరి వెంట ఎంపీటిసి ముత్తెన్న, ఉపసర్పంచ్ మోహన్ ఉన్నారు.