Mercy Financial Support


'మెర్సి ఆన్ స్లమ్స్'గల్ఫ్ బాధిత కుటుంబానికి ఆర్ధిక సాయం

మండలంలోని బన్సపల్లికి చెందిన గల్ఫ్ బాధిత కుటుంబానికి ఓ స్వచ్చంద సంస్థ సోమవారం దిలావర్ పూర్ లో తహసిల్దార్ నిజాముల్ హసన్ చేతుల మీదుగా రూ . 10 వేల ఆర్ధిక సాయం అందజేసింది. గల్ఫ్ బాధిత కుటుంబాలను ఆడుకొనేందుకు ప్రవాస భారతీయులు 'మెర్సి ఆన్ స్లమ్స్' పేరిట ఓ స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేశారు. గత నెలలో బహ్రెయిన్ లో విద్యుధాగతంతో బన్సపల్లి కి చెందిన పోల ముత్యం మరణించారు. కుటుంబ పోషణకర్త మరణంతో ముత్యం భార్య రాణి, 11 ఏళ్ల లోపు ముగ్గురు ఆడ పిల్లలు దిక్కుతోచని స్తితిలో పడ్డారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో మృతుడి భార్య పోల రాణికి ఈ సాయాన్ని అందించినట్లు సంస్థ ప్రతినిధులు నరేందర్ ఘోరే, కోటేశ్వర్ రావు, సురేష్ తెలిపారు. కార్యక్రమంలో బన్సపల్లి సర్పంచ్ శ్యాంసుందర్ రెడ్డి, ఆర్ఐ ఆనిరుద్, వి ఆర్వో వినోద్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites