Srinivas Died in Dubai


దుబాయిలో నర్సింగాపూర్ వాసి మృతి ఇంటికి చేరిన మృతదేహం

ఉన్న ఉరిలో ఉపాధి లభించక దుబాయి చేరిన ఓ అభాగ్యునికి అక్కడా చుక్కెదురయింది. ఎంతో కొంత పొగ చేసుకొని వెనక్కి వచ్చేద్దామని అనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా మృత్యువాత పడటంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఎప్పుడోస్తాడని అతని రాకకోసం ఎదురుచూస్తుండగా శవమై ఇంటికి చేరటంతో ఇంటిల్లిపాది కన్నీరుమున్నేరై విలపించారు. జగిత్యాల మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన మద్దెలపల్లి శ్రీనివాస్ (35) వడ్రంగి కార్మికుడు ఉపాధి కోసం గత కొన్నేళ్ళుగా దుబాయి వెళ్తున్నాడు. రెండేళ్ళ క్రితమే వచ్చివేల్లిన ఆటను మరోసారి వచ్చేందుకే సన్నాహాలు చేసుకుంటుండగా వారం క్రితం అనూహ్యంగా అక్కడ మృతి చెందిన సమాచారం తెలిసి కుటంబ సభ్యులు అప్పటి నుంచి మృతదేహం కోసం ఎదురుచూస్తూ కంటి మీద కునుకు లేకుండా గడిపారు. కాగ ఆదివారం మృతదేహాన్ని ఇంటికి తీసుకురాగా కన్నీళ్ళ వీడ్కోలు నడుమ అత్యక్రియలు నిర్వహించారు. స్థానిక నేతలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites