సౌదీలో దుంపేట వాసి మృతి
ఉపాధి నిమిత్తం గల్ఫ్ బాట పట్టిన కథలాపూర్ మండలం దుంపేట గ్రామానికి చెందిన మాతే గంగారం అలియాస్ ఎర్దండి (42) సౌది అరేబియాలో మృతి చెందారు. బుధవారం రాత్రి గుండెపోటుతో అతడు మృతి చెందినట్లు కుటుంబసభ్యులకు గురువారం సమాచారం అందింది. గంగారం పది నెలల కిందట రూ 1.50 లక్షలు అప్పుచేసి సౌది అరేబియా వెళ్లి దమామ్ ప్రాంతంలో పని చేస్తున్నారు. మ్రుతుడికి ఇద్దరు కూతుళ్ళు, ఒక కుమారుడు ఉన్నారు.