Sathaiah Died in Qatar


దోహా ఖతర్ లో………రామలచ్చక్కపేట వాసి హత్య

మేట్ పల్లి మండలం రామలచ్చక్కపేట గ్రామపంచాయతీ పరిధిలోని అల్లూరి సీతారామయ్యరాజు తండాకు చెందిన గుల్లావాత్ సత్తయ్య (35) దోహఖతర్ లో హత్యకు గురయ్యాడు. బతుకుదెరువు నిమిత్తం మూడేళ్ళ క్రితం అక్కడికి వెళ్ళిన సత్తయ్య తొమ్మిది నెలల క్రితం స్వగ్రామానికి వచ్చి మరోసారి వెళ్ళాడు. అక్కడ ఎపీసి కంపనీలో లేబర్, సెక్యురిటి గార్డుగా పని చేశాడు. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతం పెంచక పోవడంతో వీసా రద్దు చేసుకొని స్వగ్రామానికి రావాలని ప్రయత్నించాడు. ఇంతలోనే సత్తయ్య హత్యకు గురైనట్లు దోహా ఖతర్ లో ఉన్న తండా వాసులు సోమవారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నిరుమున్నిరుగా రోదిస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం... సత్తయ్య రంజాన్ పండుగ రోజు హత్యకు గురైనట్లు భావిస్తున్నారు. ఆ రోజు అక్కడ సెలవు దినం కావడంతో కొందరు మిత్రులు సత్తయ్యను కలిసేందుకు ఫోన్ లో ప్రయత్నించగా ఫోన్ రింగ్ అవుతున్న స్పందన రాలేదు. ఆ తర్వాత కూడా అదే పరిస్థితి. అనుమానం వచ్చిన మిత్రులు నాలుగు రోజుల క్రితం సత్తయ్య ఉండే గదికి వెళ్లి చూడగా సెల్ ఫోన్ మాత్రమే కనిపించింది. ఇంతలో పట్టన శివారులో సత్తయ్య హత్యకు గురైనట్లు అక్కడి పోలీసులు గుర్తించారు. మృతుడి వద్ద ఉన్న ఫోన్ నంబర్ల ఆధారంగా అతడి నంబరుకు ఫోన్ చేయగా మిత్రులు మాట్లాడారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకోని సత్తయ్య ఫోన్ ఎలా వచ్చిందని విచారణ జరిపి వదిలేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. సంఘటన స్తలంలో లభించిన ఆనవాళ్ళను బట్టి సత్తయ్యను కర్రలతో కొట్టి హత్య చేసినట్లు భావిస్తున్నారు. మ్రుతుడికి తల్లి గంగు, భార్య సుగుణ, కూతురు సుమలత(12), కొడుకు వినోద్ (11) ఉన్నారు. సుమలత కరీంనగర్ లో ఏడో తరగతి చదువుతుండగా, వినోద్ స్థానిక పాటశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. సత్తయ్య హత్యలో ఆ కుటుంబం ఆధారం కోల్పోయింది. తండాలో విషాదం నెలకొంది.

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites