Rajaiah Died in Maskat


మస్కట్ లో అసువులు బాసిన జూలపల్లి వాసి

చేసిన అప్పులు తీర్చాలన్న తాపత్రయంతో ఎడారి దేశం బాట పట్టిన ఓ నిరుపేద మస్కట్ లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. జూలపల్లి మండలం కేంద్రానికి చెందిన మానుమండ్ల రాజయ్య (42) నెలల క్రితం బతుకుదెరువు కోసం అప్పులు చేసి మస్కట్ కు వెళ్ళాడు. పదవ తేదిన అక్కడ పనికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతదేహాన్ని కంపెనీ అధికారులు స్వదేశానికి పంపించగా హైదరాబాద్ విమానాశ్రయానికి చేరినట్లు బంధువులు తెలిపారు. రాజయ్యకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites