సౌదీలో జగిత్యాల వాసి మృతి
జగిత్యాల ఇస్లంపురాకు చెందిన షేక్ హుసేన్ శుక్రవారం సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. షేక్ హుసేన్ తో పాటు అతని కుమారుడు అఫ్రోజ్ లు ఉపాధి రిత్యా గత కొంతకాలంగా సౌదీలో నివసిస్తున్నారు. వీరిద్దరూ ఓ వాహనం లో జెడ్డాకు వెళ్తుండగా ఎదురుగ వచ్చిన వాహనం దీకోట్టడంతో తండ్రి షేక్ హుసేన్ మృతి చెందగా కుమారుడు అప్రోజ్ రెండు కాళ్ళు విరిగినట్లు జగిత్యాలకు సమాచారం అందింది. దీంతో వారి కుటుంబ సభ్యులు విషాదం లో మునిగిపోయారు. షేక్ హుసేన్ మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు.