Rajareddy Died of Heart Attack in dubai


స్వగ్రామం చేరిన వలసజీవి మృతదేహం
గుండెపోటుతో దుబాయిలో మృతి చెందిన మల్లాపూర్ మండలం వెంకట్రావు పేట గ్రామానికి చెందిన దాసరి రాజారెడ్డి(34) మృతదేహం స్వగ్రామం చేరడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. మూడేళ్ళుగా దుబాయిలోని కొరియా ఎల్ఎల్సి కంపనిలో రాజారెడ్డి పని చేస్తున్నాడు. ఈ నెల 20 న గుండెపోటుతో మృతిచెందినట్లు కుటుంబీకులకు సమాచారం అందింది. వారం రోజుల అనంతరం మృతదేహం స్వగ్రామం చేరడంతో అంత్యక్రియలు నిర్వహించారు. శవయాత్రలో సర్పచ్ ఆనంద్ గౌడ్ తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites