స్వగ్రామం చేరిన వలసజీవి మృతదేహం
గుండెపోటుతో దుబాయిలో మృతి చెందిన మల్లాపూర్ మండలం వెంకట్రావు పేట గ్రామానికి చెందిన దాసరి రాజారెడ్డి(34) మృతదేహం స్వగ్రామం చేరడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. మూడేళ్ళుగా దుబాయిలోని కొరియా ఎల్ఎల్సి కంపనిలో రాజారెడ్డి పని చేస్తున్నాడు. ఈ నెల 20 న గుండెపోటుతో మృతిచెందినట్లు కుటుంబీకులకు సమాచారం అందింది. వారం రోజుల అనంతరం మృతదేహం స్వగ్రామం చేరడంతో అంత్యక్రియలు నిర్వహించారు. శవయాత్రలో సర్పచ్ ఆనంద్ గౌడ్ తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.