దుబాయిలో ధర్మసాగర్ పల్లి వాసి అరెస్టు
కోహెడ మండలం ధర్మసాగర్ పల్లికి చెందిన రాగుల మొండయ్య ఏప్రిల్ నెల 15న దుబాయికి వెళ్ళగా అక్కడ పోలీసులు అతన్ని అరెస్టు చేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. గతంలో దుబాయిలో పని చేసిన సమయంలో మొండయ్యకు ఒక సెల్ ఫోన్ దొరకగా అది హత్యకు గురైన ఒక వ్యక్తికి సంబంధించినదిగా పోలిసుల విచారణలో వెల్లడైంది. ఆ సెల్ ఫోన్ మొండయ్య వద్ద ఉండటంతో అతన్ని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. బతుకుదెరువు కోసం దేశంకాని దేశం పోయిన తన భర్తను అరెస్టు చేయడంతో కుటుంభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.