సౌదీలో గుండె పోటుతో మృతి చెందిన పోచయ్య
కోహెడ మండలం రామచంద్రాపూర్ కు చెందిన బోలుమల్ల పోచయ్య అనే వ్యక్తి సౌది అరేబియాలో గుండె పోటుతో మృతి చెందాడు. మూడు నెలల క్రితం అక్కడికి వెళ్ళిన అతను ఈ నెల 8 వ తేదిన మృతి చెందినప్పటికి కుటుంబసభ్యులకు సమాచారం రాలేదు. అతని భార్య, ముగ్గురు పిల్లలుండగా పెద్ద కొడుకు సంపత్ గుండె జబ్బుతో బాధపడుతున్నట్లు బంధువులు తెలిపారు. మృతదేహాన్ని నాలుగైదు రోజుల్లో తెప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు మీరంజని హెల్ప్ లైన్ జిల్లా ఇన్ ఛార్జ్ షేక్ చాంద్ షాషా తెలిపారు.