బెహరాన్ లో మల్యాల వాసి మృతి
ఉపాధి కోసం బెహరాన్ వెళ్ళిన మల్యాల వాసి పుష్పాల గోపాల్ (50) సోమవారం తెల్లవారు జామున మృతి చెందినట్లు సమాచారం అందింది. ఏడాది క్రితం గోపాల్ బెహరాన్ వెళ్ళాడు. సోమవారం తాను పని చేసే కంపెనికి చెందిన వాహనంలో అతడిని పనికి తీసుకు వెళ్ళడానికి సిబ్బంది వెళ్లి చూడగా గోపాల్ మరణించినట్లు కనుగొన్నారు. ఈ విషయాన్ని కంపెనికి తెలియజేసి శవాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించినట్లు మృతుడి బంధువులు తెలిపారు. గోపాల్ కుమారునికి ఇటివలే పోతారంనాకు చెందిన యువతితో నిశ్చితార్థం జరిగినట్లు వివరించారు. గోపాల్ మృతదేహాన్ని సాధ్యమైనంత తొందరగా స్వగ్రామం పంపించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.