సౌదీలో మేట్ పల్లి వాసి మృతి
సౌదీలో నాలుగురోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన మేట్ పల్లి వాసి చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని దుబ్బవాడకు చెందిన అబ్దుల్ మజీద్ (38) మూడేళ్ళ క్రితం సౌదిలోని రియాద్ లో డ్రైవర్ గా పని చేయడానికి వెళ్ళాడు. నాలుగు రోజుల క్రితం కారు బోల్తా పడడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు మృతుడి బావమరుదులు అజీద్,ముజీబ్,ముజాహిద్ ఫోన్ ద్వారా కుటుంబీకులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పంపడానికయ్యే ఖర్చులు భరించడానికి యజమాని అంగీకరించలేదు. దీంతో అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. మజీద్ మరణవార్త తెలిసిన అతని భార్య సాజీదబేగం, ముగ్గురు కూతుళ్ళు, కొడుకు రోదిస్తున్న తీరు పలువురి హృదయాలను కలచివేసింది.