సౌదీలో తెర్లుమద్ది యువకుడి మృతి
మండలం లోని తెర్లుమద్దికి చెందిన ఎం.డీ. ఎక్బాల్ (24) సౌదీలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ దుర్వార్త కుటుంబీకులు, బంధువులకు ఆదివారం రాత్రి తెలిసింది. మృతుడి అన్న గపూర్, మేనమామ ఉస్మాన్ తదితరులు విలేకరులకు సోమవారం తెలిసిన వివరాల ప్రకారం.... గ్రామంలో ట్రాక్టర్ ద్రివేరుగా పని చేసే ఎక్బాల్ ఆర్థికంగా నిలదొక్కుకోడానికి రెండేళ్ళ కిందట రెండు లక్షల అప్పుచేసి గల్ఫ్ కు వెళ్ళాడు. అక్కడ ఓ కంపనీలో పని చేస్తున్నాడు. కాగ శనివారం కూరగాయలు తెచ్చుకోవడానికి
రోడ్డు దాటుతుండగా ఓ కారు వచ్చి డీకొట్టడంతో అతడు మృతి చెందాడు. ఈ విషయాన్ని అక్కడే ఉంటున్న గ్రామస్తుండొకరు ఫోన్ లో కుటుంబీకులకు తెలియజేశాడు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఎంపీపీ లక్ష్మికిషన్ రావు, సర్పంచ్ లక్ష్మి మల్లేశ్, టీర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ కోరుతున్నారు.