మండల కేంద్రంలోని సుబాస్ నగరుకు చెందినా గొండబాబు (38 ) దుబాయిలో మంగళవారము రాత్రి అనారోగ్యంతో మరణించాడు. అక్కడ ఉన్న తమ బందువుల ద్వార బుధవారము ఉదయము ఈ విషయము తెలిసిందని మృతుడి బార్య గంగమని రోదీస్తూ తెలిపింది. గతేడాది లక్ష రూపాయలు వరకు అప్పు చేసి దుబైలోని అల్కొష్ నగరంలో కూలి కోసం తన బర్త వెళ్ళాడని పేర్కొంది. 6 నెలల క్రితం ఒకసారి నవీపేటకు వచ్చి వెళ్ళాడని ఆమె వివరించింది. తనకు గణేష్ (9) దీపిక (5) ఉందని వెల్లడించింది. ఇప్పుడు తమ పరిస్టితి ఏమిటని ఆమె రోదించింది. ప్రబుత్వం తన కుటుంబాన్ని ఆదుకోవాలని తన బర్త మృతదేహాన్ని తీసుకురావడానికి కృషి చెయాలని ఆమె విజ్ఞప్తి చేసింది. ఎంపిపి సూరిబాబు బాదిత కుటుంబాన్ని పరామర్శించి ప్రబుత్వం తరపున సహాయము అందే విదంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.