Naredhra Died in Dubai


స్వగ్రామం చేరిన వలసజీవి మృతదేహం

ఉపాధి నిమిత్తం గల్ఫ్ బాట పట్టిన ఓ వ్యక్తి గల్ఫ్ లో గుండెపోటుతో మరణించగా మృతదేహం శుక్రవారం స్వగ్రామానికి చేరింది. కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన పుప్పల నరేంద్ర (37) ఉపాధి నిమిత్తం దుబాయి వెళ్ళాడు. అక్కడ 3 ఆర్ఎస్ టెక్నికల్ సర్వీసెస్ 15 ఏళ్లుగా ప్రాజెక్టు ఇంజనీర్ హోదాలో పని చేస్తున్నారు. జూలై 30 న విధి నిర్వహణలో ఉన్న నరేంద్రకు గుండె నొప్పి రావడంతో అతని మిత్రులు ఆసుపత్రిలో చేర్పించగా అక్కడ మృతి చెందారు. మృతదేహం స్వగ్రామానికి రాగానే బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మ్రుతుడికి భార్య స్నేహలత, ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు.

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites