స్వగ్రామం చేరిన వలసజీవి మృతదేహం
ఉపాధి నిమిత్తం గల్ఫ్ బాట పట్టిన ఓ వ్యక్తి గల్ఫ్ లో గుండెపోటుతో మరణించగా మృతదేహం శుక్రవారం స్వగ్రామానికి చేరింది. కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన పుప్పల నరేంద్ర (37) ఉపాధి నిమిత్తం దుబాయి వెళ్ళాడు. అక్కడ 3 ఆర్ఎస్ టెక్నికల్ సర్వీసెస్ 15 ఏళ్లుగా ప్రాజెక్టు ఇంజనీర్ హోదాలో పని చేస్తున్నారు. జూలై 30 న విధి నిర్వహణలో ఉన్న నరేంద్రకు గుండె నొప్పి రావడంతో అతని మిత్రులు ఆసుపత్రిలో చేర్పించగా అక్కడ మృతి చెందారు. మృతదేహం స్వగ్రామానికి రాగానే బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మ్రుతుడికి భార్య స్నేహలత, ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు.