గల్ఫ్ లో రోడ్డు ప్రమాదంలో కోజన్ కొత్తూర్ వాసి మృతి
దసరా పండుగ ఇంటికి వస్తానని దుబాయి నుంచి ఫోన్లో మాట్లాడిన వ్యక్తి మరునాడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో అయన రాక కోసం ఎదురుచూస్తున్న కుటుంబీకులు రోదనలు మిన్నంటాయి. ఈ సంఘటన ఇబ్రహీంపట్నం మండలం కోజన్ కొత్తూర్ లో విషాదం నింపింది. గ్రామంలో ఎలక్ట్రిషియాన్ గా పనిచేసిన చౌడరపు రమేష్ (38) బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్ళాడు. టి.సి.టి అనే కన్ స్ట్రక్షణ్ కంపెనీలో కార్మికుడిగా పని చేస్తున్న అయన గత బుధవారం విధులకు వెళ్లేందుకు దుబాయి ఈన్వేస్టేమెంట్ పార్కు వద్ద బస్సు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడి మృతి చెందాడు. ఈ మేరకు బంధువులు, స్నేహితులు ఆదివారం సమాచారం అందించడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గత మంగళవారం ఫోన్ చేసి తాను దసరా పండుగకు ఇంటికి రావడానికి సిద్దమవుతున్నానని తెలిపాడంటూ భార్య రమాదేవి, కొడుకులు అచ్యుత్, అజయ్ లు రోదించడం కలిచివేసింది. గత ఏడేళ్ళ క్రితం సౌదీ అరేబియా వెళ్ళడంతో ఇంకా రూ. 1.50 లక్షల వరకు అప్పు ఉందని మృతుని బంధువులు తెలిపారు. రమేష్ మృతదేహాన్ని స్వగ్రామానికి వెంటనే తెప్పించాలని గ్రామ సర్పంచి పిండి ముత్తమ్మ, మాజీ సర్పంచి రాఘవులు, ఎంపీటీసి గంగాధర్ లు కోరారు.