Rajeshwar is Dead in dubai on roda accident



దుబాయ్ లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మల్లాపూర్ మండలం రేగుంటకు చెందిన సోమ రాజేశ్వర్ రెడ్డి (32) మృతి చెందినట్లు కుటుంబ సబ్యులకు సమాచారం అందింది. వారి కథనం ప్రకారం రాజేశ్వర్ రెడ్డి నాలుగేళ్ళుగా దుబాయ్ లోని ట్రై ఎలక్ట్రో కంపెనీ లో లేబర్గా పని చేస్తున్నాడు. నాలుగు నెలల కింద సెలవుపై వచ్చి వెళ్ళాడు. శనివారం కంపెనీకి చెందిన వస్తువులను దుబాయ్ నుండి అబుదాబికి ట్రాన్స్ పోర్ట్ చేస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని వెనుకనుండి వస్తున్న ట్రక్కు డీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడికి బార్య జల , ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి తెప్పించేందుకు అధికారులు కృషి చేయాలని సర్పంచ్ రామగౌడ్ కోరారు.

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites