స్వగ్రామం చేరిన గల్ఫ్ మృతదేహం
ఉపాధి కోసం సౌదీకి వెళ్లి అక్కడ అనారోగ్యంతో మృతి చెందిన మానాల వాసి అల్లూరి అంజన్న (50) మృతదేహం మంగళవారం స్వగ్రామం చేరింది. మృతదేహాన్ని చుసిన కుటుంబసభ్యులు బోరున విలంపించారు. గ్రామస్తులు సైతం కంటతడి పెట్టారు.అనంతరం అంత్యక్రియల నిర్వహించారు. 22 రోజుల తర్వాత శవం స్వగ్రామం చేరింది. ఉపాధి నిమిత్తం వెళ్లి ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన దుబాయి సంక్షేమ సంఘంలో అంజన్న సభ్యుడిగా ఉన్నాడు. శనివారం స్వగ్రామం చేర్చడంలో బాల్కొండ ఎమ్మేల్యే ఈరవత్రి అనిల్ తో పాటు దుబాయి సంక్షేమ సంఘం సభ్యులు ప్రత్యెక చొరవ తీసుకున్నారు. మ్రుతుడికి భార్య లక్ష్మి,ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు.