ఖతర్ లో బాల్కొండ వాసి మృతి
బ్రతుకు దెరువు కోసం గల్ఫ్ లోని ఖతర్ వెళ్లి అక్కడ జరిగిన ప్రమాదంలో బాల్కొండ మండల కేంద్రానికి చెందిన బొండ్ల చిన్నయ్య (38) మృతి చెందాడు. బాల్కొండలోని ఆర్మూర్ గాలికి చెందిన చిన్నయ్య 9 నెలల క్రితం ఖతర్ దేశానికి వలస వెళ్ళాడు. ఆదివారం అక్కడ పని చేస్తుండగా ప్రమాదవశాత్తు గోడ కూలి మృత్యువాత పడ్డాడు. ఈ విషయం గురువారం ఆలస్యంగా కుటుంబ సభ్యులకు తెలియడంతో తీవ్రంగా రోదించారు. శవాన్ని రప్పించాలని కుటుంబసభ్యులు జిల్లా కలెక్టర్ ను కోరుతున్నారు. మృతుడు చిన్నయ్యకు భార్య ఇద్దరు కూతుళ్ళు, కొడుకు ఉన్నారు. చిన్నయ్య కుటుంబ సభ్యులను లీగల్ ఎయిడ్ కౌన్సిల్ అడ్వయిజర్ జగన్, మాజీ సర్పంచ్ గంగాధర్ పరామర్శించారు.