ఒమన్ లో లక్ష్మీపూర్ వాసి మృతి
రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామస్తుడు కల్లేపల్లి లచ్చయ్య ఒమన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గత నెల 24 న కంపెనీ వాహనంలో క్యాంపు కార్యాలయానికి తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదం జరిగినట్టు అయన బంధువులు తెలిపారు. ఈ సంఘటనలో కల్లేపల్లి లచ్చయ్య అక్కడిక్కడే మృతి చెందాడు. దీంతో ఒమన్ నుంచి మృతదేహాన్ని మంగళవారం మధ్యాహ్నం తరలించారు. కల్లేపల్లి లచ్చయ్య స్వగ్రామంలో ఉపాధి లేక ఇరవైయేళ్ళ క్రితం ఒమన్ దేశానికి వలస వెళ్ళినట్లు తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు, ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. మంగళవారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా లక్ష్మీపూర్ కు మృతదేహాన్ని తరలించారు. గ్రామస్తుల పెద్ద సంఖ్యలో అంత్యక్రియలకు హాజరయ్యారు.