MERCY ON SLUMS -Let's Help Together

Well come to the MERCY ON SLUMS -Lets Help Together We are not following by religion or regional but we are following by HUMANITY. Please do support us to give gift of life to Gulf Indians and Children.

Gangaiah Died in Road Accident

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గంగయ్య దుబాయి లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొడిమ్యాల మండలం చెప్యాల పరిధిలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన బండపల్లి గంగయ్య (45) మృతి చెందాడు. ఈ మేరకు ఇక్కడి కుటుంబ సభ్యులకు బుధవారం సమాచారం అందింది. గతంలో దుబాయి వెళ్లోచ్చిన గంగయ్య కొద్దికాలం పాటు స్వగ్రామం లో గడిపాడు.ఆరు నెలల క్రితం కంపెనీ వీసాపై తిరిగి దుబాయి వెళ్ళాడు. తన కాలనికే చెందిన గంగాధర శంకరయ్య దుబాయి నుంచి స్వగ్రామానికి వెళ్తున్నందున అతడు ఉంటున్న క్యాంపస్ వెళ్లి తన కుటుంబ సభ్యుల కోసం గంగయ్య సామగ్రి అందజేశారు. తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించేందుకు అక్కడి వలస కార్మికులు ప్రయత్నిస్తున్నా...

Rajaiah Died in Maskat

మస్కట్ లో అసువులు బాసిన జూలపల్లి వాసి చేసిన అప్పులు తీర్చాలన్న తాపత్రయంతో ఎడారి దేశం బాట పట్టిన ఓ నిరుపేద మస్కట్ లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. జూలపల్లి మండలం కేంద్రానికి చెందిన మానుమండ్ల రాజయ్య (42) నెలల క్రితం బతుకుదెరువు కోసం అప్పులు చేసి మస్కట్ కు వెళ్ళాడు. పదవ తేదిన అక్కడ పనికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతదేహాన్ని కంపెనీ అధికారులు స్వదేశానికి పంపించగా హైదరాబాద్ విమానాశ్రయానికి చేరినట్లు బంధువులు తెలిపారు. రాజయ్యకు భార్య, ఇద్దరు పిల్లలున్నా...

Gopal Died in Behran

బెహరాన్ లో మల్యాల వాసి మృతి ఉపాధి కోసం బెహరాన్ వెళ్ళిన మల్యాల వాసి పుష్పాల గోపాల్ (50) సోమవారం తెల్లవారు జామున మృతి చెందినట్లు సమాచారం అందింది. ఏడాది క్రితం గోపాల్ బెహరాన్ వెళ్ళాడు. సోమవారం తాను పని చేసే కంపెనికి చెందిన వాహనంలో అతడిని పనికి తీసుకు వెళ్ళడానికి సిబ్బంది వెళ్లి చూడగా గోపాల్ మరణించినట్లు కనుగొన్నారు. ఈ విషయాన్ని కంపెనికి తెలియజేసి శవాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించినట్లు మృతుడి బంధువులు తెలిపారు. గోపాల్ కుమారునికి ఇటివలే పోతారంనాకు చెందిన యువతితో నిశ్చితార్థం జరిగినట్లు వివరించారు. గోపాల్ మృతదేహాన్ని సాధ్యమైనంత తొందరగా స్వగ్రామం పంపించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నా...

Police arrested Mendayya

దుబాయిలో ధర్మసాగర్ పల్లి వాసి అరెస్టు కోహెడ మండలం ధర్మసాగర్ పల్లికి చెందిన రాగుల మొండయ్య ఏప్రిల్ నెల 15న దుబాయికి వెళ్ళగా అక్కడ పోలీసులు అతన్ని అరెస్టు చేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. గతంలో దుబాయిలో పని చేసిన సమయంలో మొండయ్యకు ఒక సెల్ ఫోన్ దొరకగా అది హత్యకు గురైన ఒక వ్యక్తికి సంబంధించినదిగా పోలిసుల విచారణలో వెల్లడైంది. ఆ సెల్ ఫోన్ మొండయ్య వద్ద ఉండటంతో అతన్ని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. బతుకుదెరువు కోసం దేశంకాని దేశం పోయిన తన భర్తను అరెస్టు చేయడంతో కుటుంభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా...

Srinivas Died in Dubai

దుబాయిలో నర్సింగాపూర్ వాసి మృతి ఇంటికి చేరిన మృతదేహం ఉన్న ఉరిలో ఉపాధి లభించక దుబాయి చేరిన ఓ అభాగ్యునికి అక్కడా చుక్కెదురయింది. ఎంతో కొంత పొగ చేసుకొని వెనక్కి వచ్చేద్దామని అనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా మృత్యువాత పడటంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఎప్పుడోస్తాడని అతని రాకకోసం ఎదురుచూస్తుండగా శవమై ఇంటికి చేరటంతో ఇంటిల్లిపాది కన్నీరుమున్నేరై విలపించారు. జగిత్యాల మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన మద్దెలపల్లి శ్రీనివాస్ (35) వడ్రంగి కార్మికుడు ఉపాధి కోసం గత కొన్నేళ్ళుగా దుబాయి వెళ్తున్నాడు. రెండేళ్ళ క్రితమే వచ్చివేల్లిన ఆటను మరోసారి వచ్చేందుకే సన్నాహాలు చేసుకుంటుండగా వారం క్రితం అనూహ్యంగా అక్కడ మృతి చెందిన సమాచారం తెలిసి కుటంబ సభ్యులు...

Abdhul Majid Died in Kuwait

సౌదీలో మేట్ పల్లి వాసి మృతి సౌదీలో నాలుగురోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన మేట్ పల్లి వాసి చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని దుబ్బవాడకు చెందిన అబ్దుల్ మజీద్ (38) మూడేళ్ళ క్రితం సౌదిలోని రియాద్ లో డ్రైవర్ గా పని చేయడానికి వెళ్ళాడు. నాలుగు రోజుల క్రితం కారు బోల్తా పడడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు మృతుడి బావమరుదులు అజీద్,ముజీబ్,ముజాహిద్ ఫోన్ ద్వారా కుటుంబీకులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పంపడానికయ్యే ఖర్చులు భరించడానికి యజమాని అంగీకరించలేదు. దీంతో అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. మజీద్ మరణవార్త తెలిసిన అతని భార్య సాజీదబేగం, ముగ్గురు కూతుళ్ళు, కొడుకు రోదిస్తున్న...

Ravindher Died in Kuwait

గల్ఫ్ లో అన్నారం వాసి మృతి…. మృతదేహం కోసం ఎదురు చూపులు చేసిన అప్పులు తీర్చటం కోసం పొట్ట చేతిలో పట్టుకొని గల్ఫ్ కు వెళ్ళిన ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించిన సంఘటన మానకొండూర్ మండలం అన్నరంలో చోటు చేసుకుంది. వివరాలు... గ్రామస్థుల కథనం ప్రకారం అన్నారం గ్రామానికి చెందిన పొట్టల రవీందర్ (35) అనే వ్యక్తి కూలీ పని చేస్తుకుంటూ జీవిస్తున్నాడు. కుటుంబ పోషణ భారం కావడంతో అప్పులు చేశాడు. అప్పులు తీర్చేందుకు మరో రూ. 90 వేలు అప్పు చేసి ఏడాదిన్నర క్రితం గల్ఫ్ దేశమైన కువైట్ కు వెళ్ళాడు. కాగ శుక్రవారం రవీందర్ కు గుండెపోటు రావటంతో కుప్పకూలిపోయాడు. తోటి స్నేహితులు చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందినట్లు ఫోన్ ద్వారా...

Ramesh Died in Dubai

గల్ఫ్ లో రోడ్డు ప్రమాదంలో కోజన్ కొత్తూర్ వాసి మృతి దసరా పండుగ ఇంటికి వస్తానని దుబాయి నుంచి ఫోన్లో మాట్లాడిన వ్యక్తి మరునాడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో అయన రాక కోసం ఎదురుచూస్తున్న కుటుంబీకులు రోదనలు మిన్నంటాయి. ఈ సంఘటన ఇబ్రహీంపట్నం మండలం కోజన్ కొత్తూర్ లో విషాదం నింపింది. గ్రామంలో ఎలక్ట్రిషియాన్ గా పనిచేసిన చౌడరపు రమేష్ (38) బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్ళాడు. టి.సి.టి అనే కన్ స్ట్రక్షణ్ కంపెనీలో కార్మికుడిగా పని చేస్తున్న అయన గత బుధవారం విధులకు వెళ్లేందుకు దుబాయి ఈన్వేస్టేమెంట్ పార్కు వద్ద బస్సు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడి మృతి చెందాడు. ఈ మేరకు బంధువులు, స్నేహితులు ఆదివారం సమాచారం అందించడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి....

Sathaiah Died in Qatar

దోహా ఖతర్ లో………రామలచ్చక్కపేట వాసి హత్య మేట్ పల్లి మండలం రామలచ్చక్కపేట గ్రామపంచాయతీ పరిధిలోని అల్లూరి సీతారామయ్యరాజు తండాకు చెందిన గుల్లావాత్ సత్తయ్య (35) దోహఖతర్ లో హత్యకు గురయ్యాడు. బతుకుదెరువు నిమిత్తం మూడేళ్ళ క్రితం అక్కడికి వెళ్ళిన సత్తయ్య తొమ్మిది నెలల క్రితం స్వగ్రామానికి వచ్చి మరోసారి వెళ్ళాడు. అక్కడ ఎపీసి కంపనీలో లేబర్, సెక్యురిటి గార్డుగా పని చేశాడు. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతం పెంచక పోవడంతో వీసా రద్దు చేసుకొని స్వగ్రామానికి రావాలని ప్రయత్నించాడు. ఇంతలోనే సత్తయ్య హత్యకు గురైనట్లు దోహా ఖతర్ లో ఉన్న తండా వాసులు సోమవారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నిరుమున్నిరుగా రోదిస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం... సత్తయ్య రంజాన్ పండుగ...

Naredhra Died in Dubai

స్వగ్రామం చేరిన వలసజీవి మృతదేహం ఉపాధి నిమిత్తం గల్ఫ్ బాట పట్టిన ఓ వ్యక్తి గల్ఫ్ లో గుండెపోటుతో మరణించగా మృతదేహం శుక్రవారం స్వగ్రామానికి చేరింది. కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన పుప్పల నరేంద్ర (37) ఉపాధి నిమిత్తం దుబాయి వెళ్ళాడు. అక్కడ 3 ఆర్ఎస్ టెక్నికల్ సర్వీసెస్ 15 ఏళ్లుగా ప్రాజెక్టు ఇంజనీర్ హోదాలో పని చేస్తున్నారు. జూలై 30 న విధి నిర్వహణలో ఉన్న నరేంద్రకు గుండె నొప్పి రావడంతో అతని మిత్రులు ఆసుపత్రిలో చేర్పించగా అక్కడ మృతి చెందారు. మృతదేహం స్వగ్రామానికి రాగానే బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మ్రుతుడికి భార్య స్నేహలత, ఇద్దరు కూతుళ్ళు ఉన్నా...

Rajareddy Died of Heart Attack in dubai

స్వగ్రామం చేరిన వలసజీవి మృతదేహం గుండెపోటుతో దుబాయిలో మృతి చెందిన మల్లాపూర్ మండలం వెంకట్రావు పేట గ్రామానికి చెందిన దాసరి రాజారెడ్డి(34) మృతదేహం స్వగ్రామం చేరడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. మూడేళ్ళుగా దుబాయిలోని కొరియా ఎల్ఎల్సి కంపనిలో రాజారెడ్డి పని చేస్తున్నాడు. ఈ నెల 20 న గుండెపోటుతో మృతిచెందినట్లు కుటుంబీకులకు సమాచారం అందింది. వారం రోజుల అనంతరం మృతదేహం స్వగ్రామం చేరడంతో అంత్యక్రియలు నిర్వహించారు. శవయాత్రలో సర్పచ్ ఆనంద్ గౌడ్ తో పాటు గ్రామస్తులు పాల్గొన్నా...

Shaik Hussain Died in Soudi

సౌదీలో జగిత్యాల వాసి మృతి జగిత్యాల ఇస్లంపురాకు చెందిన షేక్ హుసేన్ శుక్రవారం సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. షేక్ హుసేన్ తో పాటు అతని కుమారుడు అఫ్రోజ్ లు ఉపాధి రిత్యా గత కొంతకాలంగా సౌదీలో నివసిస్తున్నారు. వీరిద్దరూ ఓ వాహనం లో జెడ్డాకు వెళ్తుండగా ఎదురుగ వచ్చిన వాహనం దీకోట్టడంతో తండ్రి షేక్ హుసేన్ మృతి చెందగా కుమారుడు అప్రోజ్ రెండు కాళ్ళు విరిగినట్లు జగిత్యాలకు సమాచారం అందింది. దీంతో వారి కుటుంబ సభ్యులు విషాదం లో మునిగిపోయారు. షేక్ హుసేన్ మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నా...

Lachayya Died in Road Accident

ఒమన్ లో లక్ష్మీపూర్ వాసి మృతి రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామస్తుడు కల్లేపల్లి లచ్చయ్య ఒమన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గత నెల 24 న కంపెనీ వాహనంలో క్యాంపు కార్యాలయానికి తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదం జరిగినట్టు అయన బంధువులు తెలిపారు. ఈ సంఘటనలో కల్లేపల్లి లచ్చయ్య అక్కడిక్కడే మృతి చెందాడు. దీంతో ఒమన్ నుంచి మృతదేహాన్ని మంగళవారం మధ్యాహ్నం తరలించారు. కల్లేపల్లి లచ్చయ్య స్వగ్రామంలో ఉపాధి లేక ఇరవైయేళ్ళ క్రితం ఒమన్ దేశానికి వలస వెళ్ళినట్లు తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు, ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. మంగళవారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా లక్ష్మీపూర్ కు మృతదేహాన్ని తరలించారు. గ్రామస్తుల పెద్ద సంఖ్యలో అంత్యక్రియలకు హాజరయ్యా...

Mercy Support for gulf Indians

MERCY ON SLUMS గల్ఫ్ దేశాలకు వెళ్లిన భారతీయులు అనేకమంది ఏజెంట్ల మోసాలకు గురి అయి తీవ్ర కష్టాలకు లోనవుతున్నారు.వారిని ఆదుకోవడం కోసం కొందరు తెలుగువారు మెర్సీ ఆన్ స్లమ్స్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. దాని వివరాలను మిత్రులు ఆత్మచరణ్ గల్ఫ్ నుంచి రాసి పంపారు.దానిని ఈ వెబ్ సైట్ లో యధాతధంగా ప్రచురిస్తున్నాము. మిత్రులారా! బ్రతుకుదెరువు కొరకు విదేశాలకు అప్పులు చేసి వెళ్ళుతున్న వారు ఎన్నో కష్టాలు పడి వెళ్తుంటారు, అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకోని పరిస్తితులవలన ఆకస్మికముగా మరణించిన వారికి సహాయముగా ఉండాలని మరియు మా యొక్క ఆవేధనలతో ఏర్పరచిన MERCY ON SLUMS ఎంతో మంది గల్ఫ్ బాధితులకు ఆధారముగా నిలబడాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నాము. గల్ఫ్ వెళ్లేవారికి వెళ్ళే స్తోమత...

Ramulu Died in Afghanistan

ఆఫ్గనిస్తాన్ లో బొంకూర్ వాసి మృతి మృతదేహాన్ని రప్పించడానికి గ్రామస్తుల విరాళం డబ్బు సంపాదించాలని అప్పులు చేసి ఆఫ్గనిస్తాన్ వెళ్ళిన ఓ నిరుపేద వ్యవసాయ కూలీ అనారోగ్యంతో మృతి చెందాడు. గ్రామస్తుల విరాళాలు సేకరిస్తున్నారు. ఈ హృదయ విచారక సంఘటన గొల్లపల్లి మండలం బొంకూర్ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సూరమల్ల రాములు (38) అనే నిరుపేద వ్యవసాయ కూలీ ఏడాది క్రితం రూ. 1.20 లక్షలు చెల్లించి ఏజెంట్ ద్వాత ఆఫ్గనిస్తాన్ వెళ్ళాడు. అక్కడికెళ్ళాక కంపెనీ వీసా కాదని, ఏజెంట్ మోసం చేసాడని, కాని ఏజెంట్ గ్రామానికి చెందిన అడ్డుగట్టు చంద్రయ్య అప్పటికే ఢిల్లీ లో అనుమానాస్పద స్తితిలో మృతి చెందాడు. రాములుకు పని దొరకక రాములుకు పని దొరకక ఇంటి నుంచే కర్చులకు...

Alluri Anjanna Died in Saudi

స్వగ్రామం చేరిన గల్ఫ్ మృతదేహం ఉపాధి కోసం సౌదీకి వెళ్లి అక్కడ అనారోగ్యంతో మృతి చెందిన మానాల వాసి అల్లూరి అంజన్న (50) మృతదేహం మంగళవారం స్వగ్రామం చేరింది. మృతదేహాన్ని చుసిన కుటుంబసభ్యులు బోరున విలంపించారు. గ్రామస్తులు సైతం కంటతడి పెట్టారు.అనంతరం అంత్యక్రియల నిర్వహించారు. 22 రోజుల తర్వాత శవం స్వగ్రామం చేరింది. ఉపాధి నిమిత్తం వెళ్లి ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన దుబాయి సంక్షేమ సంఘంలో అంజన్న సభ్యుడిగా ఉన్నాడు. శనివారం స్వగ్రామం చేర్చడంలో బాల్కొండ ఎమ్మేల్యే ఈరవత్రి అనిల్ తో పాటు దుబాయి సంక్షేమ సంఘం సభ్యులు ప్రత్యెక చొరవ తీసుకున్నారు. మ్రుతుడికి భార్య లక్ష్మి,ముగ్గురు కూతుళ్ళు ఉన్నా...

Life of gulf

గల్ఫ్ బ్రతుకు దెరువులు బ్రతుకుదెరువు కొరకు ఎడారి దేశానికి వెళ్ళిన వారు అప్పులపాలై, అప్పులు తీర్చ లేక మరణానికి పాలుపడుతున్నారు. వారికీ గల్ఫ్ వెళ్ళే స్తోమత లేకపోయిన కూడా, వారు అప్పోసోప్పో చేసి, ఏజెంట్లకు లక్షల రూపాయలు కట్టి,నెలల తరబడి వారు ఏజెంట్ల చుట్టూ తిరుగుతూ, సోమ్మసిల్లి పోతున్నారు. ఏజెంట్లు కూడా వారిని పంపిస్తామంటూ నమ్మ పలుకుతున్నారు, వారి చుట్టు నెలల, నెలలు తిప్పిచ్చికుంటున్నారు. అయితే ఇలా సమయం గడిచే కొద్ది తీసుకున్న అప్పు సమయం దగ్గర పడుతుంది. అప్పు ఇచ్చిన వారు డబ్బులు కట్టమంటూ ఒత్తిడి చేస్తారు. గల్ఫ్ వెళ్ళాలని ఏజెంట్లకు డబ్బులు కట్టినవారు, ఏజెంట్లు చెప్పిన మాటలు విని నెలల తరబడి వేచి చూస్తుంటారు. ఒక దిక్కు గల్ఫ్ కొరకు అప్పు ఇచ్చిన...

Agent Cheated the Sub Agent

ఏజెంట్ ఇంటి ముందు బాధితుల ఆందోళన గ్రామస్తుల జోక్యంతో విరమణ గల్ఫ్ పంపిస్తానని ఓ ఏజెంట్ ఘరానా మోసానికి పాల్పడ్డాడు. ఆరున నెలలుగా గల్ఫ్ పంపిస్తాడని వేచి చూసి విసిగి వేసారిన బాధితులు ఆదివారం సదరు ఏజెంట్ ఇంటి ముందు క్రిమిసంహారక మందు డబ్బాతో ఆత్మహత్యాయత్నం చేసుకుంటామని ఆందోళన చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామానికి చెందిన మద్దుల బుగ్గరేడ్డి గల్ఫ్ పంపిస్తానని ముస్తాబాద్ మండలం కొండాపూర్ కు చెందిన సబ్ ఏజెంట్ బండి శ్రీనివాస్ ద్వార రూ. 3.90 లక్షలు వసూలు చేశాడు. దుర్గం చంద్రారెడ్డి, ఐలేని చంద్రం, కొండెం వెంకటరెడ్డి, బండి నర్సయ్యలను ఇరాక్ పంపిస్తానని డబ్బులు వసూలు చేశారు. మూడు నెల తర్వాత వారిని ఢిల్లీ వరకు తీసుకెళ్ళి ఇంటికి తీసుకువచ్చాడు. సబ్ ఏజెంట్...

Narayan Died in Saudi

                             నారాయణ సౌదీలో ఆర్మూర్ వాసి మృతి పట్టణంలోని జేమ్మన్ జెట్టిగల్లికి చెందిన ఉట్నూర్ నారాయణ (32) సౌది అరేబియాలోని దమామ్ లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నారాయణ సంవత్సరం క్రితం బతుకుదెరువు నిమిత్తం ఐదేళ్ళ క్రితం దమామ్ వెళ్ళాడు. గల్ఫ్ వెళ్ళడానికి అప్పులు చేశారు. అప్పు ఇచ్చిన వారు తమ డబ్బులు చెల్లించాలని ఆర్మూర్ లోని నారాయణ కుటుంబీకులపై ఒత్తిడి చేశారు. అక్కడ జీతం తక్కువగా ఉండడంతో అప్పులు తీర్చే మార్గం కనిపించక జీవితం మీద విరక్తి చెందిన దమామ్ లో తన గదిలో నాలుగు రోజుల క్రితం ఊరి వేసుకొని ఆత్మహత్యకు...

Ramesh is dead At working place in Dubai

గల్ఫ్ లో యశ్వంతరావుపేట వాసి మృతి బతుకుదెరువు కోసం కన్నవారిని విడిచి ఎడారి బాట పట్టిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు బరువైన వస్తువు మీద పడి అక్కడిక్కడే మృత్యువాత పడ్డాడు. దీంతో ఆ కుటుంబంలో పండుగ రోజు తీరని విషాదం అలుముకుంది. మండలంలోని యశ్వంతరావుపేటకు చెందిన మందాల రమేష్ (28) అనే యువకుడు 18 నెలల క్రితం అప్పులు చేసి దుబాయి వెళ్ళాడు. అక్కడే ఓ కంపనీలో క్రేన్ ఆపరేటర్ గా పని చేసేవాడు. ఈ క్రమంలో గత శనివారం పై అంతస్తులో పనులు నిర్వహిస్తున్న క్రమంలో బలమైన వస్తువు మీద పడటంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ మేరకు అతడి స్నేహితులు కుటుంబసభ్యులకు సమాచారమందించారు. మృతుడికి భార్య రామ, ఈశ్వర్ (6), రిశ్వంత్ (4) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా అదే కంపనిలో...

About MERCY Members

ఎడారిలో ఒయాసిస్సులు ప్రార్థించే పెదవుల కన్నా.. సహాయం చేసే చేతులు మిన్న అని భావించారు. వీళ్లు ఉద్యోగ వేటలో ఎడారి దేశాలకు పరుగులు తీసి అక్కడ మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు నడుంబిగించారు. ఓ సంస్థను స్తాపించారు. పీకల్లోతు కష్టాల్లో కూరుకుపొయిన కుటుంబాలను ఓదార్చుతూ ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. ఆర్మూర్, న్యూస్ లైన్ బ్రతుకు దెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వారు అక్కడ ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కుటుంబ పెద్ద మరణంతో ఆ కుటుంబాలు పీకల్లోతు ఆ కుప్పల్లో కురుకుపోతున్నాయి. అలాంటి కుటుంబాలకు ఆడుకోవడానికి ఆర్మూర్ ప్రాంతానికి చెందిన పలువురు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. దేశం కాని దేశంలో మృత్యువాత పడ్డవారి కుటుంబాలను...

Mercy Financial Support

'మెర్సి ఆన్ స్లమ్స్'గల్ఫ్ బాధిత కుటుంబానికి ఆర్ధిక సాయం మండలంలోని బన్సపల్లికి చెందిన గల్ఫ్ బాధిత కుటుంబానికి ఓ స్వచ్చంద సంస్థ సోమవారం దిలావర్ పూర్ లో తహసిల్దార్ నిజాముల్ హసన్ చేతుల మీదుగా రూ . 10 వేల ఆర్ధిక సాయం అందజేసింది. గల్ఫ్ బాధిత కుటుంబాలను ఆడుకొనేందుకు ప్రవాస భారతీయులు 'మెర్సి ఆన్ స్లమ్స్' పేరిట ఓ స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేశారు. గత నెలలో బహ్రెయిన్ లో విద్యుధాగతంతో బన్సపల్లి కి చెందిన పోల ముత్యం మరణించారు. కుటుంబ పోషణకర్త మరణంతో ముత్యం భార్య రాణి, 11 ఏళ్ల లోపు ముగ్గురు ఆడ పిల్లలు దిక్కుతోచని స్తితిలో పడ్డారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో మృతుడి భార్య పోల రాణికి ఈ సాయాన్ని అందించినట్లు సంస్థ ప్రతినిధులు నరేందర్ ఘోరే, కోటేశ్వర్...

Gangaram is Dead at Soudi

సౌదీలో దుంపేట వాసి మృతి ఉపాధి నిమిత్తం గల్ఫ్ బాట పట్టిన కథలాపూర్ మండలం దుంపేట గ్రామానికి చెందిన మాతే గంగారం అలియాస్ ఎర్దండి (42) సౌది అరేబియాలో మృతి చెందారు. బుధవారం రాత్రి గుండెపోటుతో అతడు మృతి చెందినట్లు కుటుంబసభ్యులకు గురువారం సమాచారం అందింది. గంగారం పది నెలల కిందట రూ 1.50 లక్షలు అప్పుచేసి సౌది అరేబియా వెళ్లి దమామ్ ప్రాంతంలో పని చేస్తున్నారు. మ్రుతుడికి ఇద్దరు కూతుళ్ళు, ఒక కుమారుడు ఉన్నా...

Yekbal is dead at Soudi

సౌదీలో తెర్లుమద్ది యువకుడి మృతి మండలం లోని తెర్లుమద్దికి చెందిన ఎం.డీ. ఎక్బాల్ (24) సౌదీలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ దుర్వార్త కుటుంబీకులు, బంధువులకు ఆదివారం రాత్రి తెలిసింది. మృతుడి అన్న గపూర్, మేనమామ ఉస్మాన్ తదితరులు విలేకరులకు సోమవారం తెలిసిన వివరాల ప్రకారం.... గ్రామంలో ట్రాక్టర్ ద్రివేరుగా పని చేసే ఎక్బాల్ ఆర్థికంగా నిలదొక్కుకోడానికి రెండేళ్ళ కిందట రెండు లక్షల అప్పుచేసి గల్ఫ్ కు వెళ్ళాడు. అక్కడ ఓ కంపనీలో పని చేస్తున్నాడు. కాగ శనివారం కూరగాయలు తెచ్చుకోవడానికి రోడ్డు దాటుతుండగా ఓ కారు వచ్చి డీకొట్టడంతో అతడు మృతి చెందాడు. ఈ విషయాన్ని అక్కడే ఉంటున్న గ్రామస్తుండొకరు ఫోన్ లో కుటుంబీకులకు తెలియజేశాడు. మృతుడి కుటుంబాన్ని...

Balaiah Died in Saudi

సౌది అరేబియాలో చింతకుంట వాసి మృతి మృతదేహం కోసం కుటుంబ సభ్యుల నిరీక్షణ ఉన్న ఊరిలో ఉపాధి కరవై జీవనోపాధి కోసం ఎడారి దేశాలకు వెళ్ళిన కరీంనగర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అక్కడే మృతి చెందాడు. ఇంటి నుంచి వెళ్ళిన రెండు నెలలకే చనిపోయినట్లు కుటుంబ సభ్యులకు సౌది నుంచి సమాచారం అందడంతో కన్నిరుమున్నిరుగా విలపిస్తున్నారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... చింతకుంట లోని తారక రామకృష్ణ నగర్ కు చెందిన బోనగిరి బాలయ్య (39) గ్రామంలోనే వ్యవసాయ కూలిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. తనకు తెలిసిన ఓ ఏజెంట్ ద్వార సౌది అరేబియాలో వ్యవసాయ కూలి పనిపై వెళ్లేందుకు వీసా పొందాడు. జూలై 20 న సౌది అరేబియా వెళ్ళిన ఆతను వీసా పొందడం కోసం రూ.2...

Chinnaya Die at Katar

ఖతర్ లో బాల్కొండ వాసి మృతి బ్రతుకు దెరువు కోసం గల్ఫ్ లోని ఖతర్ వెళ్లి అక్కడ జరిగిన ప్రమాదంలో బాల్కొండ మండల కేంద్రానికి చెందిన బొండ్ల చిన్నయ్య (38) మృతి చెందాడు. బాల్కొండలోని ఆర్మూర్ గాలికి చెందిన చిన్నయ్య 9 నెలల క్రితం ఖతర్ దేశానికి వలస వెళ్ళాడు. ఆదివారం అక్కడ పని చేస్తుండగా ప్రమాదవశాత్తు గోడ కూలి మృత్యువాత పడ్డాడు. ఈ విషయం గురువారం ఆలస్యంగా కుటుంబ సభ్యులకు తెలియడంతో తీవ్రంగా రోదించారు. శవాన్ని రప్పించాలని కుటుంబసభ్యులు జిల్లా కలెక్టర్ ను కోరుతున్నారు. మృతుడు చిన్నయ్యకు భార్య ఇద్దరు కూతుళ్ళు, కొడుకు ఉన్నారు. చిన్నయ్య కుటుంబ సభ్యులను లీగల్ ఎయిడ్ కౌన్సిల్ అడ్వయిజర్ జగన్, మాజీ సర్పంచ్ గంగాధర్ పరామర్శించా...

Odellu Dead by bad illness

ఉపాధి వేటలో చితికిన బతుకు ఉపాధి కోసం ఉన్న ఊరును వదిలి వెళ్ళిన ఓ యువకుడు మృత్యఒడిలోకి చేరుకున్నాడు. చివరికి సాటి తెలుగు వారు సాయం అందించడంతో 17 రోజులకు మృతదేహం స్వగ్రామం చేరుకుంది. బందువుల కథనం మేరకు సుల్తానాబాద్ మండలంలోని ఐతరాజుపల్లికి చెందిన న్యాతరి ఓదెలు (38) ఉపాధి కోసం రెండేళ్ళ కిందట షార్జా వెళ్ళాడు. కాగ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఓదెలు గత నెల 22వ తేదిన మరణించాడు. ఓదెలు ఇంటి నుంచి షార్జా వెళ్లేందుకు బయలుదేరి ముంబాయి వరకు చేరుకున్నాకా అతని పెద్దకుమారుడు విద్యుధఘాతంతో మృతిచెందాడు. ఈ విషయం అతనికి తెలియకుండా బంధువులు జాగ్రత్తపడ్డారు. ఆరునెలలు షార్జాలో పని చేసిన తరువాత ఒదేలును కంపెనీ వారు విధులనుంచి తొలగించారు. గత కొంత కాలంగా...

Bala Lachayya sucide him self

ఉపాధి వేటలో 'చితికి' పోయిన బతుకు గల్ఫ్ నుంచి వచ్చిన యువకుడి ఆత్మహత్య ఉపాధి కోసం ఎడారి దేశానికి వలస వెళ్ళిన ఆ యువకుడిని విధి వెక్కరించింది. గల్ఫ్ కు వెళ్లేందుకు చేసిన అప్పులు అతడిని వేదనకు గురిచేశాయి.ఎల్లారెడ్డిపల్లి మండలం వెంకటాపూర్ కు చెందిన పిట్టల బాల లచ్చయ్య (22) దుబాయి నుంచి వచ్చిన 25 రోజులకే బతుకు 'చితికి' పోయింది. శనివారం రాత్రి ఇంట్లోని ఓ దూలానికి ఉరివేసుకున్నాడు. గ్రామస్థుల కథనం ప్రకారం.. బాల లచ్చయ్య మూడేళ్ళ కిందట రూ. లక్ష బాకీ చేసి దుబాయికి వలస వెళ్ళాడు. రాత్రింబవళ్ళు కష్టపడినా యజమానులు వేతనాలు చెల్లించలేదు. చివరికి ప్రవాసాంధ్రుల విరాళాలతో స్వగ్రామానికి చేరుకున్నాడు. అప్పులు తీరే మార్గం కనిపించక కుమిలిపోయి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు....

Mercy on Children

MERCY ON SLUMS A Child is God's gift to the family. Each child is created in the special image and likeness of God for greater things to love and to be loved. God told us, "Love your neighbors as yourself." So first we have to love ourselves rightly, and then love our neighbors. But how can we love ourselves unless we accept the way God has made us? Many children are working in their childhood, roving through streets; Government is not doing much about this situation. Innocent children are lying on the roads and are forced by the circumstances to beg; every night they are not sure where they will spend it. There are children who are begging...

MERCY ON SLUMS

గల్ఫ్ మృతుల కుటుంబాలకు బాసట "మెర్సి ఆన్ స్లమ్స్" ఆర్మూర్, ఏప్రిల్4 (ఆన్ లైన్) బ్రతుకు దెరువు కోసం గల్ఫ్ వెళ్లి మృతి చెందినా వారి కుటుంబాలను ఆదుకోవాలని ఇరాక్ లోని తెలుగువారు నిర్ణయించుకున్నారు. ఇటీవల ఆంధ్రజ్యోతి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా టబ్లాయిడ్లల లో ప్రచురితమైన గల్ఫ్ మృతుల కుటుంబాల దీనగాతలకు వారు చలించిపోయారు. ఈ మేరకు ఆంధ్రజ్యోతి సాయంతో రెండు కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ఇరాక్ కేంద్రంగా ప్రవాసీయులు నడుపుతున్న "మెర్సి ఆన్ స్లమ్స్" సంస్థ ముందుకు వచ్చింది. చెత్తకుప్పలు, మురికివాడల్లో మగ్గుతున్న పిల్లల, కుటుంబ పెద్దల్ని కోల్పోయి భవిష్యత్ అందకారంగా మారిన చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపేందుకు పలు కార్యక్రమాలను ఈ సంస్థ చేపడుతుంది. ఇటివల...

Pochayya dead by Heart attack in soudi

సౌదీలో గుండె పోటుతో మృతి చెందిన పోచయ్య కోహెడ మండలం రామచంద్రాపూర్ కు చెందిన బోలుమల్ల పోచయ్య అనే వ్యక్తి సౌది అరేబియాలో గుండె పోటుతో మృతి చెందాడు. మూడు నెలల క్రితం అక్కడికి వెళ్ళిన అతను ఈ నెల 8 వ తేదిన మృతి చెందినప్పటికి కుటుంబసభ్యులకు సమాచారం రాలేదు. అతని భార్య, ముగ్గురు పిల్లలుండగా పెద్ద కొడుకు సంపత్ గుండె జబ్బుతో బాధపడుతున్నట్లు బంధువులు తెలిపారు. మృతదేహాన్ని నాలుగైదు రోజుల్లో తెప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు మీరంజని హెల్ప్ లైన్ జిల్లా ఇన్ ఛార్జ్ షేక్ చాంద్ షాషా తెలిపా...

Balaraju Dead by Accident in Dubai

స్వగ్రామం చేరిన గల్ఫ్ మృతదేహం సిరిసిల్ల మండలం గ్రామానికి చెందిన ఎర్ర బాలరాజు (42) గ్రామంలో కూలీ పనులు చేస్తూ భార్య పిల్లలను పోషించుకుంటున్నాడు. గ్రామంలో ఉపాధి కరువై బాలరాజు మూడేళ్ళ క్రితం రూ. 1.50 లక్షల అప్పు చేసి దుబాయికి వెళ్ళాడని గ్రామస్తులు తెలిపారు. సుతారీ కార్మికుడిగా పని చేస్తుండేవాడన్నారు. ఏడాది క్రితం పెద్ద కుమార్తె ప్రియాంకకు రూ. 3 లక్షల కట్నం ఇచ్చి వివాహం చేసారు. అయితే కుమార్తె పెళ్ళికి వచ్చి పోతే మరో రూ. 2 లక్షలు అప్పులు చేయల్సివస్తుందని పెళ్ళికి రాకుండా అక్కడే ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఉగాది పండుగకు డబ్బులను పంపించాలంటూ భార్య దుర్గవ్వ బాలరాజుకు ఫోన్ చేయడంతో డబ్బులను పంపించేందుకు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న బాలరాజును కారు డీ కొట్టడంతో...

Two South Indians were dead in soudi

గల్ఫ్ లో ఇద్దరు మృతి చెందారు. పనులు చేసుకుంటుండగా ఒకరు, జైల్లో శిక్ష అనుభవిస్తూ మరొకరు గుండె పోటుతో మృతి చెందారు. మండలంలోని సముద్రలింగాపూర్ చెందిన కొమ్మన్నపెల్లి సాయిలు (50) , పుట్టయ్య (49) సౌదీలో మరణించారు. సాయిలు మూడేళ్ళ క్రితం గల్ఫ్ వెళ్ళగా అక్కడి పోలీసులకి చిక్కి జైలుపాలై రెండు రోజుల క్రితమే సౌదీకి వెళ్ళగా అక్కడ పని చేసుకుంటుండగానే గుండె ఆగి మృతి చెందాడు. దీంతో వీరి కుటుంబాలు దుఃఖంలో మునిగాయి. మృతులకు బార్య పిల్లలు ఉన్నా...

Soudi Police Arrested South Indians

సౌది జైల్లో జిల్లా వాసుల నరక యాతన పట్టించుకోని భారత రాయబార కార్యాలయం భర్తను విడిపించాలని సత్తమ్మ వేడుకోలు సౌదీ అరేబియా జైల్లో మగ్గుతున్న ప్రవాస భారతీయులు నరకాన్ని చవిచూస్తున్నారు. ఆదుకుంటుదనుకున్న భారత రాయబార కార్యాలయం స్పందించకపోవడం, అక్కడి అధికారులు శ్రుతిమించి వ్యవహరించడంతో జైల్లో మగ్గుతున్న జిల్లా వాసులు కన్నీరు మున్నీరవుతున్నారు. అలికిడైతే చాలు ఏమి జరుగుతుందోనని ఉలిక్కిపడుతున్నారు. ప్రాణాలతో ఇంటికి తిరిగి వెళ్తామ అని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే, మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామానికి చెందిన పాల్తేపు జలపతి 2008 ఏప్రిల్ 24 న బతుకు దెరువు కోసం ఆజాద్ వీసాపై సౌదీ అరేబియా వెళ్ళాడు. అక్కడ కపిల్(దళారీ) జలపతి...

Mercy Financial Support K. Naganna

గల్ఫ్ బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం భీమ్ గల్ మండలం బడ భీమ్ గల్ కు చెందిన గల్ఫ్ మృతుడు కే.నాగన్న కుటుంబానికి ఇరాక్ లోని మెర్సి ఆన్ స్లమ్స్ సంస్థ వారు పది వేల రూపాయలను సోమవారం అందజేశారు. నాగన్న (48) మార్చి 28 న మలేషియాలో మరణించగా ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది. దీనికి స్పందించి మెర్సి ఆన్ స్లమ్స్ ప్రతినిధులు రాజేంద్రప్రసాద్ జోయెల్ చంద్ర నాగన్న భార్య నర్సుబాయికి నగదు అందజేశారు. వీరి వెంట ఎంపీటిసి ముత్తెన్న, ఉపసర్పంచ్ మోహన్ ఉన్నా...

Children

మన కుటుంబానికి పిల్లలు దేవుడు ఇచ్చిన వరము, ప్రతి పిల్లలు ప్రత్యేకముగా జన్మించారు, దేవునికి ఇష్టమైన అపురూపము, ప్రేమించు మరియు ప్రేమించబడు. ఎంతో మంది పిల్లలు వెట్టి చాకిరీ చేయడం, వీధిన పడి తిరగడం, ప్రభుత్వం వారికీ తగిన విధముగా తోడుపడకపోవడం, తెలిసి తెలియని వయస్సులో పిల్లలు రోడ్ల మీద అడుక్కోవడం, సాయంత్రం అయ్యేసరికి ఎ గూటికి చేరాలో తెలియక రోడ్ల మీద పడుకుంటూ, చెత్తకుప్పలో వేసిన వాటిని ఏరుకొని తినడం, కట్టుకోడానికి బట్టలు, తినడానికి అన్నం లేక, ఎంతో మంది అనారోగ్యలతో మరణించడం, మరికొందరు దిక్కుతోచని చిన్నారులు. చిన్న తనంలోనే దొంగతనాలకు అలవాటుపడుతూ, వారి యొక్క భావి తరాలకు చేరగని మచ్చగా నిలిచిపోతున్నారు. ఒకవేల చిన్నారులకు తల్లిదండ్రులు ఉన్న కుడా,వారి...

Gonda Babu is Dead in Dubai

మండల కేంద్రంలోని సుబాస్ నగరుకు చెందినా గొండబాబు (38 ) దుబాయిలో మంగళవారము రాత్రి అనారోగ్యంతో మరణించాడు. అక్కడ ఉన్న తమ బందువుల ద్వార బుధవారము ఉదయము ఈ విషయము తెలిసిందని మృతుడి బార్య గంగమని రోదీస్తూ తెలిపింది. గతేడాది లక్ష రూపాయలు వరకు అప్పు చేసి దుబైలోని అల్కొష్ నగరంలో కూలి కోసం తన బర్త వెళ్ళాడని పేర్కొంది. 6 నెలల క్రితం ఒకసారి నవీపేటకు వచ్చి వెళ్ళాడని ఆమె వివరించింది. తనకు గణేష్ (9) దీపిక (5) ఉందని వెల్లడించింది. ఇప్పుడు తమ పరిస్టితి ఏమిటని ఆమె రోదించింది. ప్రబుత్వం తన కుటుంబాన్ని ఆదుకోవాలని తన బర్త మృతదేహాన్ని తీసుకురావడానికి కృషి చెయాలని ఆమె విజ్ఞప్తి చేసింది. ఎంపిపి సూరిబాబు బాదిత కుటుంబాన్ని పరామర్శించి ప్రబుత్వం తరపున సహాయము అందే విదంగా చర్యలు...

Rajeshwar is Dead in dubai on roda accident

దుబాయ్ లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మల్లాపూర్ మండలం రేగుంటకు చెందిన సోమ రాజేశ్వర్ రెడ్డి (32) మృతి చెందినట్లు కుటుంబ సబ్యులకు సమాచారం అందింది. వారి కథనం ప్రకారం రాజేశ్వర్ రెడ్డి నాలుగేళ్ళుగా దుబాయ్ లోని ట్రై ఎలక్ట్రో కంపెనీ లో లేబర్గా పని చేస్తున్నాడు. నాలుగు నెలల కింద సెలవుపై వచ్చి వెళ్ళాడు. శనివారం కంపెనీకి చెందిన వస్తువులను దుబాయ్ నుండి అబుదాబికి ట్రాన్స్ పోర్ట్ చేస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని వెనుకనుండి వస్తున్న ట్రక్కు డీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడికి బార్య జల , ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి తెప్పించేందుకు అధికారులు కృషి చేయాలని సర్పంచ్ రామగౌడ్ కోరా...

How We Support Gulf People

మీ యొక్క మెర్సి ఆన్ స్లమ్స్ పేదరికంతో బాధపడుతున్న వారికీ, ఆకస్మిక పరిస్థితులకు గురైన వారికీ, గల్ఫ్ బాధితులకు (విదేశాలకు బ్రతుకుదెరువు కొరకు అప్పులు చేసి వెళ్ళుతున్న వారు మధ్యలో ఏజంట్ల చేత మోసపోవడం కొన్ని కంపెనీలలో వారికీ తగిన ఉద్యోగాలు లేకపోవడం మరియు అధికారులు చిన్న చూపు చూడడం వలన అక్కడి పరిస్తితులు బాధలవలన స్వదేశానికి తిరిగి రావడం, వారు చేసిన అప్పులను తీర్చడానికి తగిన స్తోమత లేక వారు పురుగుల మందులు త్రాగి, ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. కొన్ని ప్రాంతాలలో నాయకులు మేము ఆధారిస్తున్నమంటూ కొన్ని పత్రికలలో, టీవీలలో ప్రచారించడం జరుగుతుంది అది మనము చూస్తున్నాము, వింటున్నాము, కాని వారు ఎవరికీ కూడా సహాయం అందించడం లేదు. ఏ రోజైన మన బంధుమిత్రుల, కుటుంబాలలో...

Naga Raju and Shanker Cheated By Agent

గల్ఫ్ కు పంపిస్తానని మోసగించిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు: కమాన్ పూర్, న్యూస్ టుడే: నిరుద్యోగులైన యువకులను సింగపూర్, దుబాయ్ వంటి దేశాలకు పంపిస్తానంటూ నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై ఆదివారం బాదితులు కమాన్పూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మండల పరిధిలోని జూలపల్లి గ్రామానికి చెందిన బోల్లపెల్లి జగన్ గౌడ్ తమను విదేశాలకు పంపిస్తానని రూ.3 లక్షల గ్రామానికి చెందిన మల్హర్ మండలం పెద్దతూండ్ల గ్రామానికి చెందిన గుండా నాగరాజు, వెనిశెట్టి శంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే కమాన్ పూర్కు చెందిన మంద రాజయ్య, బాలకృష్ణల వద్ద నుండి జగన్ రూ. 2 .75 లక్షలు తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ఐ.పి నోటిసులు పంపించారని...

Gulf Indians

Indians working in Gulf are also facing problems of different stature. Many agents are duping innocent candidates who want to work in Gulf. There is no legal system through which they can be booked for cheating the innocent and these poor victims are left with no choice and take the drastic step of committing suici...

Page 1 of 11123Next

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites